Newsటాలీవుడ్ హాట్ హీరోయిన్ కెరీర్ మ‌టాష్ చేసిన ఒకే ఒక్క ఫొటో......

టాలీవుడ్ హాట్ హీరోయిన్ కెరీర్ మ‌టాష్ చేసిన ఒకే ఒక్క ఫొటో… ఎవ‌రా హీరోయిన్‌..!

ఆమె తన అంద చందాలు, మత్తెక్కించే కళ్ళతో దేశాన్ని ఊపేసిన గొప్ప హీరోయిన్. బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించిన ఆ అందగత్తె తెలుగులోనూ కొన్ని సినిమాలలో నటించింది. అలాంటి అందగత్తె కెరీర్ ఒకే ఒక ఫోటో నాశనం చేసింది. అందగత్తె ఎవరో కాదు 1980లో బాలీవుడ్ కుర్రకారుని తన అందచందాలతో ఒక ఊపు ఊపేసిన మందాకిని. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల‌ సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం చావు బతుకుల మధ్య ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. దావూద్‌ 1980 బాలీవుడ్ ను కూడా శాసించాడు.

హీరోయిన్ మందాకినినీ ఎంతో ఆరాధించాడు. ఆమెను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. 20వ దశకంలో స్టార్ హీరోయిన్గా రాణించిన మందాకిని కెరీర్‌లో 1985లో రిలీజ్ అయిన రామ్ తేరీ గంగా మేలి టాప్ మూవీ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆమె బాలీవుడ్‌లో తిరుగులేకుండా దూసుకుపోయింది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ జానపద చిత్రం సింహాసనంతో పాటు బాలకృష్ణ నటించిన భార్గవ రాముడు సినిమాలోని నటించింది. అయితే దావూద్ ఇబ్రహీంతో దిగిన ఒకే ఒక్క ఫోటో బయటకు రావడంతో ఆమె కెరీర్ నాశనం చేసింది. 1994 లో దావూద్‌తో మందాకిని కలిసి ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

మొదట తనకేం తెలియదని బుకాయించిన మందాకిని ఆ తర్వాత మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని చెప్పింది. ఈ ఫోటో బయటకు వచ్చాక మందాకినికి అవకాశాలు రావడం ఆగిపోయాయి. కొంతకాలం ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అనంతరం డాక్టర్ కాగ్యూర్ రింపోచే ఠాకూర్ ను పెళ్లాడి విదేశాల్లో సెటిల్ అయింది. వీరికి రబ్బిల్ అనే కుమారుడు, రబ్జే ఇనయ అనే కుమార్తె ఉన్నారు. మందాకినితో ప్రేమాయణం ఫెయిల్ అయ్యాక.. దావూద్.. నటి, మోడల్ అనిత అయ్యూబ్‌తో కూడా ప్రేమాయణం నడిపాడని అంటారు. ఆమెను సినిమాల్లో తీసుకోవడానికి నిర్మాత జావెద్ సిద్ధికి నిరాకరించడంతో దావుద్ అతడిని కాల్చి చంపాడని చెప్తూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news