Moviesఅందరి ముందు అలాంటి ప్రశ్న అడిగిన రిపోర్టర్.. కోపంతో రాజమౌళి ఏం...

అందరి ముందు అలాంటి ప్రశ్న అడిగిన రిపోర్టర్.. కోపంతో రాజమౌళి ఏం చేశాడో చూడండి..!

రాజమౌళి ..ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా..? ఎప్పుడెప్పుడు అడగాల్సిన క్వశ్చన్స్ అడిగేస్తామా..? అంటూ మీడియా వాళ్ళు ఎప్పుడు కాచుకొని కూర్చుంటారు . ఆ ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోరు . సరిగ్గా అలాంటి వాళ్లకే దొరికేశాడు జక్కన్న . టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి బాహుబలి 3ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇది మొత్తం ఆనిమేటెడ్ సిరీస్ . ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి మీడియాతో మాట్లాడింది చాలా చాలా తక్కువ . అసలు లేదనే చెప్పాలి .

దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు . దీంతో ఆయనను అడగాలి అనుకున్న ప్రశ్నలు అన్ని టపా టపా అంటూ అడిగేసారు మీడియా మిత్రులు . తాజాగా బాహుబలి యానిమేషన్ సిరీస్ కోసం మీడియా ముందుకు వచ్చారు రాజమౌళి . అమెజాన్ ప్రైమ్ లో మే 17 న స్ట్రీమింగ్ కాబోతుంది ఈ యానిమేషన్ సిరీస్ . అందులో భాగంగా తాజాగా మీడియా కోసం రెండు ఎపిసోడ్లను ప్రదర్శించారు . అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జక్కన్న కు ప్రశ్నలు ఎదురయ్యాయి .

” యానిమేషన్ చేసి బాహుబలి సినిమాని చెడగొట్టారు అని మీకు అనిపిస్తుందా..?” అని రాజమౌళిని ప్రశ్నించగా ..”అలా ఏం లేదు.. ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది.. తాము ఏ కాన్సెప్ట్ ని చెడగొట్టడం లేదు ..జనాలు కూడా అలాగే అనుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు”. “ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చరణ్ ని ఎక్కువగా ఎన్టీఆర్ ని తక్కువగా చేసి చూపించారు ..విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ..దానిపై మీ ఆన్సర్ ఏంటి..?” అని ప్రశ్నించగా..” అది చెప్పడానికి ఇది సరైన సందర్భం కాదు.. వేదిక కూడా కాదు “అంటూ తప్పించుకున్నాడు . ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. అంటే రాజమౌళి ఎన్టీఆర్ విషయంలో తప్పు చేశాడు అనే కదా అంటూ నందమూరి ఫ్యాన్స్ రాజమౌళిని ఏకేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news