Moviesడల్లాస్‌లో ' సుస్వర మ్యూజిక్ అకాడమీ ' 21వ వార్షికోత్స‌వం.. అంబ‌రాన్నంటిన...

డల్లాస్‌లో ‘ సుస్వర మ్యూజిక్ అకాడమీ ‘ 21వ వార్షికోత్స‌వం.. అంబ‌రాన్నంటిన సంబ‌రాలు

నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు అలాగే సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మీనాక్షి అనుపిండి. ఈమె దాదాపు 21 ఏళ్ళ నుంచి సుస్వర మ్యూజిక్ అకాడమీని స్థాపించి ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఈ సంస్థ యొక్క వార్షికోత్సవాలను జరిపిస్తుస్తున్నారు. ఈ ఏడాది కూడా ఈ వార్షికోత్సవాలను మే 5న (ఆదివారం) డల్లాస్ లోని గ్రాండ్ సెంటర్ ఆడిటోరియంలో ఘననంగా నిర్వ‌హించారు. ఈ నేపథ్యంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి డల్లాస్ నగరంలోని ప్రముఖులు మాత్రమే కాకుండా తెలుగు చిత్రసీమకి చెందిన సినీ తారలు కూడా అతిధులుగా విచ్చేసి విజయవంతం చేశారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ అయినటువంటి శ్రీ ప్రసాద్ తోటకూర గారు, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులుగా ముఖ్యపాత్రను పోషిస్తున్న శ్రీ గోపాల్ పోనంగి గారు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల గారు, శ్రీమతి శారద సింగిరెడ్డి గారు, శ్రీ ప్రకాష్ రావు గారు అతిధులగా హాజరయ్యారు. వీరితో పాటుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్. పి. పట్నాయక్ గారు, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వి. ఎన్‌. ఆదిత్య‌ గారి తో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి గారు తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శించారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన ప్రేక్షకులందరినీ మరో ప్రపంచంలోకి తీసుకువెళ్ళిందనడంలో అతిశయోక్తి లేదు. అలాగే సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షిక సంబరాల వేదికపై, చంద్రబోస్ గారికి “సుస్వర సాహిత్య కళానిధి” అనే బిరుదునిచ్చి సత్కరించడం గొప్ప విషయం.

అంతేకాదు, చంద్ర‌బోస్ గారు త‌న స్వ‌గ్రామం అయినటువంటి చల్లగరిగెలో ప్రారంభించిన ఆస్కార్ గ్రంధాల‌య నిర్మాణానికి, ఈ కార్య‌క్ర‌మం ద్వారా దాదాపు 15 వేల డాల‌ర్స్ కు పైగా విరాళం రావ‌డం మ‌రొక విశేషం. ఇక ఈ వార్షిక సంబరాల్లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఆర్. పి. పట్నాయక్ గారు త‌న మాట‌ల‌తో , పాట‌ల‌తో ప్రేక్ష‌కులను ఎంతగానో అల‌రించారు. ఇదే సందర్భంగా ఆయ‌న‌కు, “సుస్వర నాద‌నిధి”, అనే బిరుదుతో మీనాక్షి అనిపిండి గారు సత్కరించడం జ‌రిగింది. ఇక సుస్వర మ్యూజిక్ అకాడమీ లోని విద్యార్థినీ, విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఆధ్యంతం ర‌క్తిక‌ట్టించ‌డం అందరూ మెచ్చుకోదగ్గ విషయం. ఇక వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన కుమారి సంహిత అనిపిండి, శ్రీమతి ప్రత్యూష చక్కగా ఆకట్టుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news