Newsప‌వ‌న్ ప్లేస్‌లో గోపీచంద్‌... విసిగిపోయిన క్రిష్ బ్లండ‌ర్ మిస్టేక్ చేస్తున్నాడా..!

ప‌వ‌న్ ప్లేస్‌లో గోపీచంద్‌… విసిగిపోయిన క్రిష్ బ్లండ‌ర్ మిస్టేక్ చేస్తున్నాడా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తున్నాడు. ఇందులో సుజిత్ దర్శకత్వంలో ఓజీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్ సింగ్, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలలో ముందుగా ఓజి థియేటర్లలోకి రానుంది. ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే శ్రీ సూర్య మూవీస్ నిర్మిస్తున్నారు. ఎప్పుడో ఏడాదిన్నర క్రితం ఈ మూవీ పట్టాలెక్కింది. ఇప్పటికీ షూటింగ్ పూర్తికాలేదు.

ఈ సినిమా మొదలయ్యాక పవన్ భీమ్లా నాయక్‌, బ్రో సినిమాలు పూర్తి చేశాడు. ఓజీ కూడా చాలా వరకు అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చాలావరకు షూటింగ్ అయింది. అయినా వీర‌మల్లు సినిమాకు మాత్రం డేట్లు ఇచ్చేందుకు అంత ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. ఇది చారిత్రక సినిమా ఈ సినిమా కోసం ఎక్కువ డేట్లు ఇవ్వాలి. అయితే పవన్ ఇప్పుడున్న బిజీ పరిస్థితిలో ఈ సినిమాకు కావలసినన్ని బల్క్ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు.

క్రిష్ కూడా పవన్ కోసం వేచి చూసి అలిసిపోయి చివరకు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయడం మంచిద‌న్న‌ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసలు పవన్ ఈ సినిమాకు ఎప్పుడు డేట్లు ? ఇస్తాడో కూడా తెలియని పరిస్థితి. అప్పటివరకు క్రిష్ తన కెరీర్ ప‌ణంగా పెట్టి ఈ సినిమా కోసం ఎదురు చూడలేని పరిస్థితి. అందుకే ఇప్పుడు మరో హీరో గోపీచంద్‌తో ఓ సినిమాను పట్టాలెక్కించాలని క్రిష్‌ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం శ్రీనువైట్ల – గోపీచంద్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పటికే ఈ సినిమా ఆలస్యం కావడంతో నిర్మాత ఏఏం.రత్నంపై భారీ భారం పడుతుంది. ఇప్పుడు ఇది మరింత ఎక్కువవుతుందని చెప్పాల్సిందే. ఏదోలా ఈ సినిమాను పూర్తి చేసి త్వరగా రిలీజ్ చేస్తే నిర్మాత వడ్డీల భారం నుంచి గట్టెక్కుతాడు. ఇప్పుడు క్రిష్ మరో సినిమా ప్రారంభిస్తే నిర్మాత‌ మరింత మునిగిపోయే ఛాన్సులే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news