Newsప‌వ‌న్ బొక్క పెట్టాడు... ఎన్టీఆర్ క‌వ‌ర్ చేశాడు... నిర్మాత షాకింగ్ కామెంట్స్‌..!

ప‌వ‌న్ బొక్క పెట్టాడు… ఎన్టీఆర్ క‌వ‌ర్ చేశాడు… నిర్మాత షాకింగ్ కామెంట్స్‌..!

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో భాగస్వామిగా ఉన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కూడా కొన్ని సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కొన్ని విషయాలపై ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఇందులో కొన్ని కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి. తాజాగా ఆయన హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో బాగా నచ్చిన సినిమా ఏది ? నచ్చ‌ని సినిమా ఏది ? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు.

ఆ బ్యానర్ లో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా తనకు చాలా బాగా ఇష్టమని.. అజ్ఞాతవాసి సినిమా తనను బాగా ఇబ్బంది పెట్టిందని ఓపెన్ గా చెప్పేశారు. కొన్ని చాలెంజింగ్ సందర్భాలు కూడా ఉంటాయి బయటకు చెప్పుకోలేం.. తనకు మోస్ట్ చాలెంజింగ్ మూమెంట్ మాత్రం అజ్ఞాతవాసి.. ఆ సినిమా జనవరిలో రిలీజ్ అయింది.. ఆ సినిమా ఇచ్చిన షాక్ నుంచి బయటికి రావటానికి మా అందరికీ రెండు నెలలకు పైగా పట్టిందని… చాలా ఇబ్బందుల్లో ఉన్న టైంలో తారక్ అన్న‌ మాకు చాలా హెల్ప్ చేశాడని ఆయన చెప్పారు.

ఆ దెబ్బ నుంచి మమ్మల్ని అందరినీ బయట పడేసాడు. ఆ ఏడాది హిట్టు కొట్టి చూపిద్దామంటూ ఎంకరేజ్ చేశాడు. అలా అరవింద సమేతతో తాము కొంత కోలుకున్నాం అంటూ నాగవంశీ తెలిపారు. తాజాగా నాగ వంశీ మ్యాడ్ సినిమా నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్ లో మీడియా ముందుకు వచ్చిన ఆయన పై విషయాన్ని చెప్పారు.

అయితే పవన్ కళ్యాణ్ సినిమా వ‌ల్ల త‌మ‌కు వచ్చిన లాస్ ను ఎన్టీఆర్ కవర్ చేశారు అని ఓపెన్ గా చెప్పటం సంచలనంగా మారింది. ఇక గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకున్న అంశంపై కూడా ఆయన మాట్లాడారు. కేవలం ఆమె డేట్లు సర్దుబాటు చేయలేక తప్పుతుందని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news