Moviesగాడ్ ఫాదర్ థియేటర్‌లో జై బాలయ్య నినాదాలు... షాకింగ్ సీన్ ఎక్కడో...

గాడ్ ఫాదర్ థియేటర్‌లో జై బాలయ్య నినాదాలు… షాకింగ్ సీన్ ఎక్కడో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళీ సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది గాడ్ ఫాదర్. మోహన్‌రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్యఅతిథిగా కీలకపాత్రలో కనిపించారు. నయనతార, సత్యదేవ్ తదితరులు నటించిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికే ఐదు రోజులు పూర్త‌వ్వ‌గా 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు మేకర్స్ చెప్పారు. అటు అమెరికాలో వన్ మిలియన్ మార్కు క్రాస్ చేస్తోంది.

ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత మెగా అభిమానులు గాడ్ ఫాదర్ సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్నారు. దసరా కానుకగా నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాకు పోటీగా వచ్చిన గాడ్ ఫాదర్ అన్ని ఏరియాల‌లో మంచి వసూళ్లు సాధిస్తోంది. మరోవైపు ది ఘోస్ట్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో గాడ్ ఫాదర్ కు బాక్సాఫీస్ దగ్గర ఎదురులేకుండా పోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడుతున్న కొన్ని థియేటర్ల‌లో బాలయ్య అభిమానులు జై బాలయ్య… జై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తుండటం విచిత్రంగా మారింది.

బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం థియేటర్ల‌లో గాడ్ ఫాదర్ సినిమా చూస్తున్న‌ బాలయ్య అభిమానులు.. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటర్వల్ సమయంలో జై బాలయ్య నినాదాలు చేస్తూ థియేటర్‌ను హోరెత్తిస్తున్నారు. బాలయ్య అక్కడ వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అక్క‌డ బాల‌య్య‌కు అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు.

హిందూపురాన్ని నందమూరిపురం అని చాలామంది ముద్దుగా పిలుస్తూ ఉంటారు. అందుకే బాలయ్య పై ఉన్న అభిమానాన్ని గాడ్ ఫాదర్ ఇంటర్వెల్‌ సమయంలో ఇలా చూపించారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గతంలో బాలయ్య నటించిన రూలర్ సినిమాతో పాటు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజు పండగే సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి.

అప్పుడు కూడా హైదరాబాద్‌లోని పలు మల్టీప్లెక్స్ థియేటర్ల‌లో సాయి ధరమ్ తేజ్ సినిమా ఇంటర్వెల్‌ వచ్చినప్పుడు జై బాలయ్య నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తించారు. బాలయ్య అభిమానులకు ఎప్పుడు ఇదో సరదాగా ఉంటూ వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news