Moviesబిగ్ షాకింగ్: నయన్ వాళ్లు సరోగసి చేసుకోలేదు..కవల పిల్లలకు కారణం ఇదే..!?

బిగ్ షాకింగ్: నయన్ వాళ్లు సరోగసి చేసుకోలేదు..కవల పిల్లలకు కారణం ఇదే..!?

ఎస్ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ..డైరెక్టర్ విగ్నేశ్ శివన్ బిడ్డలని సరోగసి ప్రాసెస్ ద్వారా కనలేదు అన్నట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే కొన్నాళ్ళు ప్రేమించుకున్న ఈ జంట జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అంతేకాదు ఇప్పటికే రెండు హనీమూన్లు కంప్లీట్ చేసుకున్న నయనతార విఘ్నేశ్ శివన్ మూడో హనీ మూన్ ని కూడా ప్లాన్ చేసుకున్నారు అన్నట్లు తెలిసింది.

అయితే నిన్న సాయంత్రం ఎవరు ఊహించిన విధంగా విగ్నేశ్ శివన్ ” నేను నయన్..అమ్మ అప్ప అయ్యాము” అంటూ సంచలన పోస్ట్ పెట్టాడు . అంతేకాదు నయనతార కవల పిల్లలకు తల్లి అయినట్లు వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తూ వాళ్ళ కాళ్లను ముద్దాడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . దీంతో ఒక్కసారిగా సినీ లోకం షాక్ అయిపోయింది . నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నా నయనతారకు అప్పుడే కవల పిల్లలు పుట్టడం ఏంటి అంటూ ఆశ్చర్యపోయారు . అందరూ సరోగసి ద్వారా పిల్లల్ని ప్లాన్ చేసుకున్నారు అని అనుకున్నారు . అయితే అందుతున్న సమాచారం ప్రకారం నయనతార విగ్నేష్ సరోగసి చేసుకోలేదట .

విగ్నేష్ శివన్ బంధువులలో ఒకరికి కవల పిల్లలు పుట్టడం తో వాళ్లు ఈ పిల్లల్ని దత్తత తీసుకుంటామని చెప్పి అఫీషియల్ గా పేపర్స్ మీద సైన్ చేసి వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రులు అయినట్లు తెలుస్తుంది . కోలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ పిల్లల్ని కన్న తల్లి కి భర్త యాక్సిడెంట్ లో మరణించాడట. అయితే, ఫైనాన్షియల్ గా ఆ పోజీషన్ లో లేని ఆమె నయన్ విగ్నేశ్ బిడ్డలుగా పెరిగితే సినీ ఇండస్ట్రీలో గుర్తింపు ఉంటుందని వాళ్ళ భవిష్యత్తు చక్క దిద్దుతుందని ఈ సంచలన నిర్ణయానికి పూనుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ నయనతార విగ్నేశ్ శివన్ తీసుకున్న నిర్ణయం చూసి కొందరు మెచ్చుకుంటూ ఉంటే ..మరి కొందరు మీకు ఆరోగ్యం బాగుండి మీరు పిల్లలు కనకుండా ఇలా వేరే పిల్లల్ని తీసుకోవడం ఏంటి అంటూ మండిపడుతున్నారు .దీంతో మరోసారి నయనతార విగ్నేశ్ శివన్ పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news