Moviesయాంకర్ శ్రీముఖి కి ఊహించని షాక్..మండిపడుతున్న మహిళలు..?

యాంకర్ శ్రీముఖి కి ఊహించని షాక్..మండిపడుతున్న మహిళలు..?

ప్రస్తుతం ఉన్న యంగ్ యాంకర్ లలో ఎనర్జ్టిక్ యాంకర్ ఎవరంటే టక్కున చెప్పే సమాధానం..శ్రీముఖి. ఈ అమ్మడు తెలుగు బుల్లితెర‌పై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం బుల్లితెర స్టార్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న శ్రీ‌ముఖి హీరోయిన్ల రేంజ్ పాపులారిటీ సంపాదించుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.. వెండితెర‌పై న‌టిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి.. తాజాగా యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్’.. అనే సినిమా ధియేటర్స్ లో విడుదలైంది. అయితే ఈ సినిమాని కొంతమంది మహిళలు నిలిపివేయాలంటూ నినాదాలు చేస్తున్నారట.

‘క్రేజీ అంకుల్స్’..సినిమ వయస్సు మళ్లిన అంకుల్స్‌కి, ఓ యువతి మధ్య జరిగే రొమాన్స్‌పై నడుస్తోంది. సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణిలు ప్రధాన పాత్రల్లో నటించరు. అయితే ఈ సినిమా కామెడీ పరంగా బాగున్నా మహిళల పట్ల కించపరిచే విధంగా ఉందని మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి సినిమాలు చూడడం వల్ల కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టుకోవాల్సి వస్తుందని.. అందుకే ఈ సినిమాని ఆపివేయాలని మహిళా సంఘం వారు డిమాండ్ చేస్తున్నారు.

మహిళలను కించపరిచే విధంగా ఈ సినిమా ఉందని తెలంగాణ మహిళా హక్కుల వేదికకు చెందిన పలువురు మహిళా హక్కుల కార్యకర్తలు ‘క్రేజీ అంకుల్స్’ బృందంపై కేసు నమోదు చేశారు. నిరసనకారులు సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. పలు థియేటర్ల వద్ద కూడా మహిళలు నిరసన తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news