Newsఎన్టీఆర్ తో పూరి గొడవ .. అంతా సెట్ రైట్...

ఎన్టీఆర్ తో పూరి గొడవ .. అంతా సెట్ రైట్ అయినట్టేనా..!

ఓ పక్క జై లవకుశ టీజర్ ఇండస్ట్రీని అల్లకల్లోలం చేస్తుంటే మరో పక్క ఈ టీజర్ చూసి పూరి అప్సెట్ అయ్యాడన్న వార్త సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. ఎన్.టి.ఆర్ స్క్రిప్ట్ దొంగ అంటూ పెద్ద మాటే అనేశారు. అయితే ఈ విషయం పట్ల అటు ఎన్.టి.ఆర్, ఇటు పూరి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పూరి చెప్పిన ఓ కథ తాలూకా నెగటివ్ షేడ్స్ తోనే జై పాత్ర డిజైన్ చేశారని టాక్.

ఇక దీని పట్ల పూరి చాలా హర్ట్ అయ్యాడని తెలిసింది. అందుకే ఈ మ్యాటర్ పెద్దది కాకుండానే తారక్ పూరితో మాట్లాడి అంతా సెట్ రైట్ చేశాడని అంటున్నారు. టెంపర్ తర్వాత పూరితో సినిమా చేయాల్సి ఉన్నా సరైన కథ దొరకలేదని బాబితో ఫిక్స్ అయ్యాడు తారక్. అయితే జై లవకుశ టీజర్ తో పూరి చేసిన రచ్చకు ఎన్.టి.ఆర్ సైలెంట్ గా పూరితో చర్చలు జరిపి మ్యాటర్ క్లోజ్ చేశాడట.

ఇద్దరి మధ్య మంచి డీల్ కుదిరిందట. ఈ మ్యాటర్ వదిలేస్తే తనకో సినిమా చేసి పెడతా అని ఎన్.టి.ఆర్ మాటిచ్చాడట. సో మొత్తానికి అలా పూరి జై విషయంలో సైలెంట్ అయ్యాడని అంటున్నారు. పూరి, తారక్ మధ్య వచ్చిన ఈ చిన్న డిస్టబన్స్ అంతా క్లియర్ అయ్యిందని తెలుస్తుంది. మరి ఇది నిజమేనా అంటే ఏదైనా పక్కాగా క్లారిటీ వచ్చేవరకు ఏ విషయం కన్ఫాం చేయలేమని కూడా అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news