Newsముగిసిన పూరి విచారణ.. కీలక సమాచారం లభించిందన్న పోలీసులు..!

ముగిసిన పూరి విచారణ.. కీలక సమాచారం లభించిందన్న పోలీసులు..!

టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ లో స్టార్ డైరక్టర్ పూరి జగన్నాధ్ ఈరోజు పోలీసు విచారణలో పాల్గొన్నారు. ఉదయం పదిన్నరకు మొదలైన ఇంటరాగేషన్ రాత్రి తొమ్మిదిన్నర వరకు జరిగింది. తొమ్మిది గంటల నలభై నిమిషాలకు పూరి అక్కడి నుండి వెళ్లిపోయారు. దాదాపు 11 గంటల పాటు పూరి జగన్నాధ్ ను విచారించి కీలక సమాచారాన్ని అందుకున్నట్టు టాక్.

డ్రగ్స్ రాకెట్ లో కస్టడీలో ఉన్న కెల్విన్ తో పూరికి పరిచయం ఎలా సాగింది. కెల్విన్ ద్వారా పూరి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశాడు వంటి విషయాలను పోలీసులు విచారణలో అడిగారని తెలుస్తుంది. అయితే పూరి జగన్నాధ్ కొన్ని సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేయగా పోలీసు వారు తమ దగ్గరున్న ప్రూఫ్స్ తో పూరి నుండి సమాధానం రాబట్టేలా చేశారట.

కేవలం ఓ ఈవెంట్ లో పరిచయమే అని చెప్పిన పూరికి పోలీసులు జ్యోతిలక్ష్మి సెట్ లో ఛార్మి బర్త్ డే వేడుకల్లో కెల్విన్ వచ్చిన ఫోటో చూపించి షాక్ ఇచ్చారు. కెల్విన్ తో డ్రగ్స్ సంబందిత విషయాల పట్ల తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు పూరి. చివరగా ఉస్మానియా హాస్పిటల్ నుండి డాక్టర్స్ వచ్చి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు.

మొత్తానికి పూరి విచారణ ముగిసింది.. పూరి ఏయే విషయాలను బయట పెట్టాడు.. పోలీసులు పూరిని ఏ కోణాల్లో ప్రశ్నలు వేశారు అన్నది కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. 11 గంటల పాటు జరిగిన ఈ సుధీర్ఘ విచారణలో అసలేం జరిగింది.. ఏం జరుగుతుంది అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక రేపు కెమెరామన్ శ్యాం కె నాయుడు సిట్ విచారణకు హాజరు కానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news