Newsజీవితం నాశనం చేశారు : పూరి జగన్నాథ్ (వీడియో)

జీవితం నాశనం చేశారు : పూరి జగన్నాథ్ (వీడియో)

డ్రగ్స్ కుంభకోణంలో టాలీవుడ్ స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ను నిన్న 11 గంటల పాటు విచారణ జరిపారు. కొంత కీలక సమాచారం పూరినుండి సేకరించారని పోలీసులు చెప్పారు. ఇక నిన్న జరిగిన హంగామాలో మీడియా చేసి అతికి పూరి తీవ్రంగా హర్ట్ అయ్యాడని తెలుస్తుంది. రాత్రి 9:30 దాకా జరిగిన విచారణ ముగించుకుని ఇంటికెళ్లిన పూరి ట్విట్టర్ లో ఓ వీడియో మెసేజ్ పెట్టాడు.

డ్రగ్స్ కేసులో పోలీసు వారు తనని విచారించారని.. కెల్విన్ తో తనకు ఏమన్నా సంబంధం ఉందా అని అడిగారని.. తాను లేదని చెప్పానని. తాను ఇప్పటిదాకా ఎలాంటి ఇల్లీగల్ పనులు చేయలేదని.. చేయనని. తన దృష్టిలో పోలీసులు చాలా గొప్పవారని.. అందుకే తను చాలా సినిమాలు పోలీస్ బ్యాక్ గ్రౌండ్ తో తీశానని అన్నారు. ఇక ఈ విషయంలో మీడియా చేసిన అతికి చాలా బాధగా ఉందని అన్నారు పూరి.

ఏవేవో ప్రోగ్రామ్స్ చేసి తన జీవితాన్ని నాశనం చేశారని అన్నాడు పూరి. ఛానెల్స్ వారంతా తనకు తెలుసని వారితో మంచి రిలేషన్ ఉందని అయినా సరే సరైన టైంలో తనని వారందరు చాలా బాధకలిగించారని అన్నాడు పూరి. మీడియాలో వచ్చిన కథనాలకు చాలా హర్ట్ అయినట్టు ఉన్నాడు పూరి. తన ఇంట్లో వాళ్లు నాలుగు రోజుల నుండి ఏడుస్తూ కూర్చుకున్నారని.. అందరి పరిస్థితి ఇలానే ఉందని వీడియో మెసేజ్ ముగించారు పూరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news