Newsమ‌నోజ్ ఆ మాట చెప్పగానే భోరున ఏడ్చేసిన భార్య మౌనిక‌...!

మ‌నోజ్ ఆ మాట చెప్పగానే భోరున ఏడ్చేసిన భార్య మౌనిక‌…!

టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ వ్యాఖ్యాత‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ గేమ్ షో ర్యాంప్ ఆడిద్దాం ఈనెల 15వ తేదీ నుంచి ఈటీవీ విన్ వేదికగా ఇది ప్రసారం కానుంది. తాజాగా ఈ షో ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ క్రమంలోనే మంచి మనోజ్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అభిమానులు ఎప్పుడు అండగా ఉన్నారని ఏడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నందుకు క్షమించాలని కోరాడు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత తాను మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నా.. ఈ గ్యాప్‌లో తాను మరో జీవితాన్ని చూసే గతంలో సినిమాలు చేసినప్పుడు ఒక అభిరుచి లక్ష్యంతో చేసేవాడిని అని తెలిపాడు.

ఏడేళ్ల గ్యాప్ తీసుకున్నా కూడా అభిమానులు తనపై చూపించిన ప్రేమాభిమానాలు బాధ్యతగా తీసుకొని రీ ఎంట్రీ ఇస్తున్నా అని తెలిపారు. ఇన్నేళ్ల‌లో నాకు ధైర్యంగా నిలిచింది అభిమానులే అని.. మౌనికలో ప్రేమలో పడిన తర్వాతే అభిమానులు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో నాకు అర్థమైందని తెలిపాడు. ఇకపై వినోదం మరో రేంజ్ లో ఉంటుందని.. ఈ గేమ్ షో తో నాకు మంచి టీం దొరికింది అందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని మనోజ్ తెలిపాడు. రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు గారు, ఈటీవీ సీఈవో బాపినిడి గారు, నితిన్, సాయికృష్ణ సాయికిరణ్ ఇలా ప్రతి ఒక్కరు ఈ షోను అద్భుతంగా తీర్చిదిద్దటంలో మాకు ఎంతో సపోర్టుగా నిలిచారని మనోజ్ తెలిపాడు.

ఇది ఒక సెలబ్రిటీ గేమ్ షో అని.. తమను ఎంతగానో అభిమానించే ఫ్యాన్ కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట ఇది.. ఈ ఆటలో సెలబ్రిటీ గెలుచుకున్న మొత్తాన్ని ఆ అభిమానికి ఇచ్చేస్తాం.. అదే ఈ గేమ్‌ స్పెషాలిటీ. ఈ గేమ్‌ ప్రైజ్ మనీ 50 లక్షలు స్పెషల్ గిఫ్ట్‌లు.. కూడా ఉంటాయని మనోజ్ తెలిపాడు. ఇక ఏడేళ్ల గ్యాప్ త‌ర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నా మౌనిక నా జీవితంలోకి వచ్చాక అభిమానులు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారని అర్థమైందని మనోజ్ చెప్పినప్పుడు అక్కడే ఉన్న ఆయన సతీమణి మౌనిక తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.. ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news