Moviesఆస్తులు అమ్ముకుంటున్న శ్రీదేవి కూతుళ్లు.. కారణం అదేనా.. ఫ్యాన్స్ కి దిమ్మ...

ఆస్తులు అమ్ముకుంటున్న శ్రీదేవి కూతుళ్లు.. కారణం అదేనా.. ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇది..!

సినిమా ఇండస్ట్రీలో అతిలోకసుందరి అనగానే అందరికీ టక్కున గుర్తుచేది శ్రీదేవి . తన అందంతో తన నటనతో ఎన్నో అవార్డులు అందుకొని ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్న శ్రీదేవి ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ వాళ్ళ కూతుర్లు ఆమె గుర్తులను ముందుకు తీసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ అచ్చం అమ్మలాగే ఉండడం తో అందరూ ఆమెలో శ్రీదేవిని చూసుకుంటున్నారు .

కాగా తెలుగులో దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తున్న జాన్వి కపూర్ బాలీవుడ్ లో పలు సినిమాలు చేసినప్పటికీ క్రేజ్ దక్కించుకోలేకపోయింది . రీసెంట్గా బోనీ కపూర్ – జాన్వి కపూర్- ఖుషి కపూర్ తమ ఉమ్మడి ఆస్తిని అమ్మేశారు . ముంబైలోని అందేరీలో వీళ్ళ ముగ్గురికి జాయింట్ గా నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి . వీటిని వీళ్లు అమ్మేశారు . ఈ నాలుగు ఫ్లాట్స్ కూడా కేవలం 12 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది .

ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి పొజిషన్లో ఉన్న జాన్వి కపూర్ ఖుషి కపూర్ డబ్బు పరంగా వెల్ సెటిల్ అయినా సరే ఎందుకు ఈ ఫ్లాట్స్ అమ్మారు అన్నది తెలియడం లేదు . అయితే తమ నిరార్ధక ఆస్తులను వదిలించుకునే ప్రయత్నంలోనే ఈ పని చేశారు అంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . త్వరలోనే ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ తీసుకొనే ఆలోచనలో ఉందట . తెలుగులో దేవరతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ పలు ఫోటోషూట్స్ యాడ్స్ రూపంలో కూడా భారీగానే డబ్బులు సంపాదిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news