Moviesబాలయ్యతో చచ్చిన అలా చేయను..ముఖంమీదే చెప్పేసి హర్ట్ చేసిన స్టార్ హీరోయిన్...

బాలయ్యతో చచ్చిన అలా చేయను..ముఖంమీదే చెప్పేసి హర్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా దివంగత అందాల నటి సౌందర్య గురించి కూడా పరిచయం అవసరం లేదు. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన టాప్ హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత బాలయ్య, సౌందర్య కాంబోలో నర్తనశాల సినిమా పట్టాలెక్కినా ఆ సిసినిమా ఎందుకనో మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఆ తరువాత మళ్లీ బాలయ్యతో సౌందర్యతో జోడీగా కట్టలేదు. కానీ, వీరిద్దరి కాంబోలో రావాలనుకున్న ఓ సినిమా మాత్రం మిస్ అయింది. ఆ సినిమా మిస్ కావడానికి కారణం మాత్రం సౌందర్య అని భోగట్టా.

ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే చెన్నకేశవరెడ్డి. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సంగతి విదితమే. టబు, శ్రియా ఇందులో హీరోయిన్లుగా నటించారు. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించగా రాయలసీమ ఫ్యాక్షన్ వేపధ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2002లో విడుదలై అభిమానులను ఖుషి చేసింది. అయితే బక్షాఫీస్ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేదు.

ఈ విడుదలై ఇరవై ఏళ్లు అయిన సందర్భంగా మొన్నటికి మొన్న చెన్నకేశవరెడ్డిని రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే రీ రిలీజ్ లో ఈ మూవీ పెను దుమారం రేపింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సౌందర్య నటించాల్సిందట. తండ్రి పాత్రలో నటించిన బాలకృష్ణకు జోడిగా సౌందర్యనే మొదట అనుకున్నారట. అయితే కథ విన్న సౌందర్య వెంటనే నో చెప్పిందట. ఎందుకంటే, ఈ సినిమాలో బాలయ్య భార్యగానే కాదు తల్లిగా కూడా కనిపించాల్సి ఉంటుంది. అందుకే బాలయ్యతో చస్తే అలా చేయ్యనని సౌందర్య తెగేసి చెప్పిందని సమాచారం. విషయం ఏమంటే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు తల్లి పాత్రలు చేస్తే ఆ తరువాత కూడా అదే తరహా పాత్రలు వస్తాయని సౌందర్య భావించిందట. అది అస్సలు మేటర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news