Moviesఛార్మీ, పూరి ఫోన్లు కూడా ఎత్త‌ట్లేదు.... టార్గెట్ చేసింది ఎవ‌రంటే...!

ఛార్మీ, పూరి ఫోన్లు కూడా ఎత్త‌ట్లేదు…. టార్గెట్ చేసింది ఎవ‌రంటే…!

పూరి జ‌గ‌న్నాథ్‌, హీరోయిన్ ఛార్మీ బంధం గురించి గ‌త ఐదారేళ్లుగా ర‌క‌ర‌కాల పుకార్లు ఉన్నాయి. అస‌లు పూరి లైఫ్‌లోకి ఛార్మీ ఎంట‌ర్ అయ్యాక పూరి కెరీర్ బాగా దెబ్బ‌తింద‌ని ఐదారు సినిమాల‌కు గాని ఒక్క హిట్ ఇవ్వ‌లేక‌పోతున్నాడంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక పూరి, ఛార్మీ క‌లిసే సినిమాలు చేస్తున్నారు. గ‌త ఆగ‌స్టులో లైగ‌ర్ సినిమా వ‌చ్చింది. పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో వీరిద్ద‌రికి వ‌చ్చిన ఓవ‌ర్ ప్లోస్ లాభాలు కూడా ప‌ట్టుకుపోయింది.

లైగ‌ర్ కొన్న వాళ్లు అంద‌రూ నిండా మునిగిపోయారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 9 నెల‌లు అవుతున్నా సినిమా న‌ష్టాల తాలూకూ గొడ‌వ‌లు ఇంకా అలాగే ఉన్నాయి. ఈ సినిమా కొని భారీగా న‌ష్ట‌పోయిన బ‌య్య‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు అంద‌రూ హైద‌రాబాద్‌లో ఏకంగా నిర‌హార దీక్ష‌లు చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఈ సినిమా కొని భారీగా న‌ష్ట‌పోయిన వారిలో నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ వ‌రంగ‌ల్ శీను ఒక‌రు.

పూరి జ‌గ‌న్నాథ్ అంటే త‌న‌కు ఎంతో ఇష్టం అని… ఆయన సినిమాల ప‌రంగానే కాకుండా.. వ్య‌క్తిగ‌తంగా కూడా త‌న‌కు ఇష్టం అని.. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా కొని పూరికి ఎవ్వ‌రూ ఇవ్వ‌లేని ఓవ‌ర్ ఫ్లోస్ లాభాలు కూడా ఇచ్చిన‌ట్టు చెప్పాడు. అయితే ఈ సినిమాతో వ‌చ్చిన లాభాల కంటే లైగ‌ర్ సినిమాతో చాలా న‌ష్ట‌పోయామ‌ని చెప్పాడు.

సినిమా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యి న‌ష్ట‌పోయాక డైరెక్ట‌ర్ పూరితో, ఛార్మీతో మాట్లాడేందుకు తాను ప్ర‌య‌త్నించా అని.. అయితే త‌న ఫోన్ కూడా వారు లిఫ్ట్ చేయ‌ట్లేదంటూ వ‌రంగ‌ల్ శ్రీను ఆవేద‌న‌తో కూడిన ఆరోప‌ణ‌లు చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారిద్ద‌రు త‌న ఫోన్ లిఫ్ట్ చేయ‌లేద‌ని వాపోయాడు. ఇక డైరెక్ట‌ర్‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నాలు చేసే బ‌య్య‌ర్లు, ఎగ్జిబిట‌ర్ల‌కు వార్నింగ్ ఇస్తూ పూరి ఎవ‌రైనా బ‌తికేది ప‌రువు కోస‌మే అన్న వ్యాఖ్య‌ల‌పై శీను మాట్లాడుతూ త‌న‌కూ కూడా ప‌రువు ఉంటుంది క‌దా అన్నాడు.

ఇక వాట్సాప్ గ్రూపుల్లో పూరికి వ్య‌తిరేకంగా వైర‌ల్ అయ్యే మెసేజ్‌ల‌కు త‌న‌కు సంబంధం లేద‌ని.. అది ఎలా స్ప్రెడ్ అయ్యిందో త‌న‌కు తెలియ‌ద‌ని.. కావాల‌నే కొంద‌రు తనపై కక్ష గట్టి కొందరు ఈ డ్రామాను నడిపించారని శ్రీను చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news