NewsNTR 30పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన ర‌త్న‌వేలు… యంగ్‌టైగ‌ర్ ఫ్యాన్స్‌కు...

NTR 30పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన ర‌త్న‌వేలు… యంగ్‌టైగ‌ర్ ఫ్యాన్స్‌కు భోజ‌నం అక్క‌ర్లేదు..

టాలీవుడ్ నుండి భారీ అంచనాలున్న సినిమాల్లో ఎన్టీఆర్ 30 వ ప్రాజెక్ట్ ఒకటి. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో హిట్ కొట్టి ఏకంగా యేడాది దాటుతోంది. మార్చి 25కే ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా వ‌చ్చి యేడాది అయ్యింది. ఎన్టీఆర్ ప్లానింగ్‌తో ఉండి ఉంటే ఇప్ప‌టికే ఎన్టీఆర్ నుంచి మ‌రో సినిమా కూడా వ‌చ్చి ఉండేది. అటు ఆచార్య ప్లాప్ కావ‌డం.. కొర‌టాల శివ డైల‌మాలోకి వెళ్లి ఎన్టీఆర్ కోసం క‌థ‌ను ర‌క‌ర‌కాలుగా మార్పులు చేసి ఎట్ట‌కేల‌కు లేట్‌గా షూటింగ్ మొద‌లు పెట్టాడు.

అస‌లే జ‌న‌తా గ్యారేజ్ లాంటి సూప‌ర్ హిట్ సినిమా వీరి కాంబినేష‌న్లో వ‌చ్చింది. 2016లో నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ రూపంలో రెండు సూప‌ర్ హిట్లు ఎన్టీఆర్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. అందుకే ఈ క్రేజీ కాంబినేష‌న్లో సినిమా అన‌గానే అంచ‌నాలు మామ‌లూగా లేవు. ఓ వైపు ఈ సినిమాను ఏప్రిల్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు.

ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ ఇప్ప‌టికే కంప్లీట్ అయ్యింది. రెండో షెడ్యూల్లో ఎన్టీఆర్ – జాన్వీ క‌పూర్ మ‌ధ్య వ‌చ్చే సీన్ల‌తో పాటు కొన్ని యాక్ష‌న్ సీక్వెన్సులు షూట్ చేశారు. అయితే ఈ సినిమాకు ప‌ని చేస్తోన్న సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు ఓ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చేశారు. రెండో షెడ్యూల్ కంప్లీట్ అయిన‌ట్టు అభిమానుల‌కు ట్వీట్ట‌ర్ వేదిక‌గా తెలియ‌జేశారు.

అలాగే ఎన్టీఆర్ యాక్ష‌న్‌, స్టైల్ కూడా చాలా బాగున్నాయ‌ని కూడా మెసేజ్‌లో రాసుకువ‌చ్చాడు. ఈ ట్వీట్‌తో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇంకా సినిమా రిలీజ్‌కు యేడాది టైం ఉన్నా అప్పుడే సంబ‌రాలు అన్న‌ట్టుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news