Moviesరీచా గంగోపాధ్యాయ టాలీవుడ్‌కు గుడ్ బై చెప్ప‌డానికి వాళ్లు పెట్టిన టార్చరేనా..?

రీచా గంగోపాధ్యాయ టాలీవుడ్‌కు గుడ్ బై చెప్ప‌డానికి వాళ్లు పెట్టిన టార్చరేనా..?

అమెరికాలో 2007 మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న రీచా గంగోపాధ్యాయ లీడర్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బరువైన ఎద అందాలతో మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది రీచా. ఈ సినిమాలో నటన పరంగా టాలీవుడ్ మేకర్స్‌ను, హీరోలను ఆకట్టుకోవడంతో మంచి సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది. లీడర్ సినిమా తర్వాత నాగవల్లి, మిరపకాయ్ సినిమాలలో నటించింది. నాగవల్లి ఫ్లాప్ అనే విషయం అందరికీ తెలిసిందే.

కానీ, ఆ ప్రభావం రీచా మీద ఏమాత్రం పడలేదు. మాస్ మహారాజ రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన మిరపకాయ్ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో అమాయకమైన పాత్రలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో అందాల ఆరబోత కూడా బాగానే చేసింది. దాంతో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అనుకున్నంత స్థాయిలో రీచాకి అవకాశాలివ్వలేదు.

రవితేజ సరసన సారొచ్చారు సినిమాలో నటించింది. ఈ సినిమాలో మేయిన్ లీడ్ కాజల్ అగర్వాల్. దాంతో రీచా ఉన్నా పెద్దగా తన కెరీర్‌కి ఉపయోగపడింది లేదనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత మిర్చి చేసింది. ప్రభాస్ సరసన నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే, ఇందులో కూడా మేయిన్ హీరోయిన్ అనుష్క శెట్టి కావడం పెద్ద మైనస్ అయింది. ప్రభాస్‌తో సాంగ్స్..మంచి సీన్స్ ఉన్నా ఆల్రెడి ప్రభాస్ – అనుష్కలకి ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఉండటం రీచాకి మైనస్ అయింది.

మంచి హిట్ సినిమాలలో నటించిన ఇక్కడ ఉన్న ఓ సమస్య తనని మరీ ఇబ్బంది పెట్టిందట. ఒక సినిమా చేయాలంటే కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాలి. ఈ విషయంలో బాగానే నలిగిపోయిందట రీచా గంగోపాధ్యాయ. దాంతో నాకు సినిమా ఇండస్ట్రీ సూటవదని డిసైడయి నాగార్జున సరసన నటించిన భాయ్ సినిమా తర్వాత సర్దేసుకొని అమెరికాకి వెళ్లిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశాలే లేవని ప్రస్తుతం తను గడుపుతున్న హ్యాపీ లైఫ్ చూస్తుంటే తెలుస్తోంది. 2019లో పెళ్లి చేసుకున్న రీచా ఇప్పుడు ఓ బిడ్డకి తల్లిగా ఆనందకరమైన జీవితం గడుపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news