Movies"మా తాత వద్దంటున్నారు"..పిల్లల పై ఉపాసన షాకింగ్ పోస్ట్..!!

“మా తాత వద్దంటున్నారు”..పిల్లల పై ఉపాసన షాకింగ్ పోస్ట్..!!

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా ఎదగనివ్వడం లేదు..ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నా..ముఖ్యంగా అందరు కన్ను మాత్రం..మెగా హీరోల పైనే ఉంటాయి. వాళ్లు ఏం చేస్తున్నారా..ఎలా డౌన్ చేయాలి..ఎలా డీగ్రేడ్ చేయాలి అంటూ..కొందరు మెగా హేటర్స్ కాచుకుని కూర్చుంటారు. అలాంటి వాళ్లకి మెగా కోడలు ఉపాసన మైండ్ బ్లాకింగ్ ట్వీస్ట్ ఇచ్చింది.

ఇండస్ట్రీలో మెగా వారుసుడు రాక కోసం ఎంతో మంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ జంట ఆ గుడ్ న్యూస్ మాత్రం చెప్పడం లేదు. అయితే, రీసెంట్ గా మెగా కోడలు ఆధ్యాత్మిక గురువు సద్గురుతో జరిగిన కార్యక్రమంలో పాల్గొని..పిలల్ల కనడం పై ప్రస్తావించింది. అయితే, దీనికి సద్గురు..”నువ్వు అంతరించిపోతున్న జాతివి కాదు..ఇప్పటికే దేశ జనాభా చాలా ఎక్కువుగా ఉంది. నీలా ఆరోగ్యంగా ఉండి పిల్లలను కనకుండా ఉండే వాళ్ళను నేను అప్రిషీయేట్ చేస్తాను..” అంటూ చెప్పుకొచ్చారు.

సద్గురు మాటలను కొందరు తప్పు పడితే..మరికొందరు..నిజమేగా అంటూ సమర్ధించారు. అయితే, తాజాగా ఉపాసన కూడా సద్గురు మాటలకు నెగిటీవ్ గా రిప్లై ఇచ్చింది. “పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్న వారికి నేను అవార్డ్ ఇస్తానని సద్గురు అన్న మాటలకు ఉపాసన కామెంట్ చేస్తూ.. ‘సద్గురు.. మీ అవార్డు తీసుకునేందుకు మా తాత గారు అంగీకరించడం లేదు’ అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంటే ఉపాసన ఇప్పుడు పిల్లలను కనడానికి సిద్ధంగా ఉన్నట్లేగా అంటూ మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news