Moviesజూ.ఎన్టీఆర్ వీరాభిమాని మృతి.. శోక సంద్రంలో తారక్ ఫ్యాన్స్..!!

జూ.ఎన్టీఆర్ వీరాభిమాని మృతి.. శోక సంద్రంలో తారక్ ఫ్యాన్స్..!!

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా..అందులో నందమూరి నట వారసుడు NTR అంటే అందరిలోకి ప్రత్యేకం. అదో తెలియని ఓ రకమైన, క్రేజ్..ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందరి హీరోలా అభిమానుల ఆయనని ఓ స్టార్ లా చూడరు..మన ఇంట్లో వ్యక్తిలా.. ప్రతి కుటుంబం లో పెద్ద దిక్కులా..ఓ అన్న లా భావిస్తుంటారు. NTR కూడా అలానే..తన అభిమానుల పట్ల చాలా కేరింగ్ గా ఉంటారు.

కాగా, అలాంటి వీరాభిమానిలో ఒకరు అయిన జనార్ధన్ ..ఇక లేరు. ఆయన తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. యంగ్ టైగర్ NTR అంటే పడి చచ్చిపోయే అభిమానుల లిస్ట్ లో.. శ్రీకాళహస్తికి చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ కూడా ఉంటారు. NTR అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. కొన్ని రోజులు ముందు యాక్సిడెంట్ కి గురై.. కోమాలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడు స్వయాన NTR ..జనార్ధన్ అమ్మ గారితో మాట్లాడి..ధైర్యం చెప్పి..నేను ఉన్నాను అంటూ అందగా నిలుచుని వైద్య ఖర్చులను తారక్ తన సొంత డబ్బులతో కట్టాడు.

అయితే, మంగళవారం అతడి ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. డాక్టర్స్ ఎంత ట్రై చేసిన ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. దీంతో జనార్ధన్ హాస్పిటల్ బెడ్ పైనే మృతి చెందారు. ఈ విషయాని వైద్యులు తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న NTR వీరాభమాని.. విషమ పరిస్థితిలో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ పోస్ట్లు పెడుతున్నారు. ఇలా చిన్న వయసులోనే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news