Moviesఈసారి బాలయ్య పైసా వసూల్ పాన్ ఇండియా రేంజ్‌లోనే..?

ఈసారి బాలయ్య పైసా వసూల్ పాన్ ఇండియా రేంజ్‌లోనే..?

ఈసారి బాలయ్య పైసా వసూల్ పాన్ ఇండియా రేంజ్‌లోనే..ఉండబోతుందా..? అంటే ఖచ్చితంగా అవుననే ఫిక్సవ్వాలి. నట సింహం కెరీర్‌లో ఖచ్చితంగా చెప్పుకునే సినిమా పైసా వసూల్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా పైసా వసూల్ సినిమాలో బాలయ్య మేకోవర్, గెటప్, యాక్షన్ చాలా హైలెట్ అయ్యాయి. అంతేకాదు, ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ దాదాపు ఆయన కెరీర్‌కు దగ్గరాగా ఉన్నవే. పూరి బాలయ్యను ఎంత ఫాలో అయి ఉండకపోతే ఇలాంటి డైలాగులు రాస్తారు.

అందుకే, మరోసారు పైసా వసూల్ కాంబినేషన్ రిపీటవబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన కథ కూడా పూరి జగన్నాథ్ రెడీ చేసినట్టు సమాచారం. కరోనా సెకండ్ వేవ్ సమయంలో పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ సమయంలో పూరి ఏడెనిమిది కథలను సిద్ధం చేసుకున్నారు. వాటిలో ఒకటి మాత్రం ప్రత్యేకంగా బాలయ్య కోసమే పూరి రాశారు. అంతేకాదు, ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించబోతున్నారు.

ఎందుకంటే పూరి జగన్నాథ్ ఇప్పుడు తెరకెక్కిస్తున్న జనగణమన పాన్ ఇండియా రేంజ్‌లో 5 భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఇక లైగర్ కూడా పూరి 5 భాషలలోనే రిలీజ్ చేయనున్నారు. అంటే ఇక పూరి తన ప్రతీ సినిమాను పక్కా పాన్ ఇండియా రేంజ్‌లోనే తీయాలని డిసైడయ్యారని అర్థమవుతుంది. కాబట్టి..కాస్త ఆలస్యం అయినా కూడా బాలయ్య – పూరి కాంబోలో వచ్చే సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ విష‌యంలో పూరీయే బాగా క‌సితో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటుగా మిగతా సౌత్ భాషలలో అలాగే హిందీలో రిలీజ్ చేస్తారని నందమూరి అభిమానులు ఫిక్సైయ్యారు. ఇక ప్రస్తుతం బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని ఓ సినిమాను రూపొందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే ఈ సినిమాను దసరా బరిలో దింపనున్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఆ తర్వాత బాలయ్య – పూరి సినిమా ప‌ట్టాలు ఎక్క‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news