Moviesనా మాట కి విలువ లేదా..? పవన్ కు కోపం తెప్పించిన...

నా మాట కి విలువ లేదా..? పవన్ కు కోపం తెప్పించిన “అంటే సుందరానికి టీం”..!!

నిన్న హైదరబాద్ లోని శిల్ప కళావేదికలో జరిగిన నాని హీరోగా నటించిన..”అంటే సుందారినికి”..ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గేస్ట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చారు. నిజానికి ఈ ఫంక్షన్ నాని సినిమా కోసం చేసినా..అక్కడ మాత్రం అందరు పవన్ నెక్స్ట్ సినిమా “భవదీయుడు భగత్ సింగ్” సినిమా ఈవెంట్ లాగనే అనిపించింది. స్టేజీ పైకి వచ్చిన వారు కూడా పవన్ ని పొగిడేస్తూ..ఆయన గురించే మాట్లాడారు తప్పిస్తే..నాని గురించి మాట్లాడింది చాలా తక్కువ.

ఫంక్షన్ మొదలైనప్పటి నుండి..పవన్ ఫ్యాన్స్ ఒక్కటే అరుపులు. “పవన్..సీ ఎం పవన్ సీ ఎం” అంటూ అరుస్తూనే ఉన్నారు. నిజానికి ఆయన ఫంక్షన్ మొదలైన చాలా సేపటికి వచ్చారు. ఈ లోపు స్టేజి పైకి వచ్చి మాట్లాడుతున్న వేరే సెలబ్రిటీలను కూడా మాట్లాడనివ్వలేదు..కంటిన్యూ గా అరుస్తూనే ఉండేసరికి..రామ జొగయ్య శాస్త్రి గారు ..స్టేజీ దిగ్గి వెళ్లిపోయారు. అప్పటికి సుమ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేస్తూనే వచ్చింది..కానీ..వాళ్ళ అభిమానం హద్దులు దాటిపోయింది.

ఇక ఫైనల్ మూమెంట్ రానే వచ్చింది. స్టేజీ పైకి వచ్చిన పవన్ కల్యాణ్..అందరికి ధన్యవాదాలు తెలుపుతూ..”సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని ..నాని కి మా ఇంట్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారని..ఆయన సహజమైన నటన బాగుటుందని..నానికి మంచి ఫ్యూచర్ ఉందని “చెప్పుకొచ్చారు.

అలాగే.. “అంటే సుందారినికి ఈవెంట్ లో పవన్ AV వెయ్యడం పై ..ఆయన కోపడ్డారు.” ఇది నాని-నజ్రియా, సినిమా..మధ్యలో నా AV ఎందుకు..నేను ఆల్ రెడీ చెప్పను హరీష్ శంకర్ కి, మైత్రి వాళ్లకి..అయినా కానీ నా AV వేశారు. నాకు ఇలాంటివి నచ్చవు..మీ ఫ్యాన్స్ దెబ్బకి వాళ్లు భయపడి వేశారు” అంటూ కోపడుతూనే కూల్ గా చెప్పుకొచ్చాడు. పవన్ కే కాదు..అక్కడున్న మిగతా వాళ్ళకి ఇది నచ్చకపోయుండచ్చు. మొత్తానికి..”అంటే సుందరానికి ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ని..”భవదీయుడు భగత్ సింగ్” సినిమా ఫంక్షన్ గా మార్చేశారు మైత్రి మేకర్స్..అంటున్నారు నాని అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news