Moviesవారెవ్వా: చరిత్రను తిరగరాసిన సాయిపల్లవి..ఇప్పటి వరకు ఆమె టాప్..శభాష్..!!

వారెవ్వా: చరిత్రను తిరగరాసిన సాయిపల్లవి..ఇప్పటి వరకు ఆమె టాప్..శభాష్..!!

సాయి పల్లవి..అబ్బో అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. ఒక్క సినిమాతోనే తన భవిష్యతు సెట్ చేసుకునేసిన బ్యూటీ. మలయాళి ముద్దుగుమ్మ సాయి పల్లవి..చేసింది కొన్ని సినిమాలు వాటిల్లో హిట్ అయ్యిన సినిమాలు చాలా తక్కువ కానీ, ఓ సారి ఆమె ఫ్యాన్స్ ఫాలోయింగ్ సైడ్ లుక్ ఎస్తే..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇంచు మించు పవన్ కల్యాన్ కి ఉన్నంత ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి. ఓ ఫంక్షన్ లో డైరెక్టర్ సుకుమార్ సైతం ఆమెను లేడీ పవర్ స్టార్ అంటూ పొగిడేశారు.

ప్రస్తుతం మనం చూస్తున్న హీరోయిన్లల్లో సాయి పల్లవి ఒక్కటే..గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ టాలెంట్ ని నమ్ముకుని..కష్టాని నమ్ముకుని ముందుకు వెళ్తుంది. సినిమా 3 కోట్లు ఇస్తే కానీ సైన్ చేయను అని డైరెక్టర్స్ మొహానే చెప్పేస్తున్నారు నేతి కాలం హీరోయిన్లు. అలాంటిది సాయి పల్లవి, తాను నటించిన సినిమా ఫ్లాప్ అయితే, ఆ డబ్బులను నిర్మాతలకి వెనక్కి ఇచ్చేస్తుందట. అలాంటి సంధర్భాలు కూడా మనం చాలానే చూశాం.

కాగా, ఇప్పుడు సాయి పల్లవి మరోసారి అభిమానులు చేత శభాష్ అనిపించుకుంటుంది. దానికి రీజన్ ..ఆమె వరుసగా మూడుసార్లు బిహైండ్ వుడ్స్ అవార్డ్స్‌లో బంగారు పతకం సొంతం చేసుకుంది. అలా సెలెక్టెడ్‌గా మంచి పాత్రలు చేయడం వల్లే.. సాయి పల్లవిని అవార్డులు వరుసగా వరిస్తున్నాయి. మొదటిసారి 2017లో కాళి సినిమాకు గాను మొదటిసారి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత 2019లో మలయాళంలో ఫహాద్ ఫాజిల్ చేసిన అథిరన్ సినిమాకి గాను రెండో గోల్డ్ మెడల్ అందిపుచ్చుకుంది. తాజాగా సాయి పల్లవికి శ్యామ్ సింగ రాయ్‌లో పోషించిన దేవదాసి పాత్రకు గాను గోల్డ్ మెడల్ దక్కింది. ఒక దక్షిణాది నటి ఇప్పటివరకు ఇంత అతి తక్కువ టైంలోనే వరుసగా మూడు గోల్డ్ మెడల్స్‌ను సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి. తొలిసారి ఈ అరుదైన ఘనత సాధించింది సాయి పల్లవినే!..దీంతో ఆమెకు కంగ్రాట్స్ చెప్పుతున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news