Moviesఎట్టకేలకు పూజా కల నెరవేరిందట.. పిచ్చ హ్యాపీగా ఉన్న బుట్టబొమ్మ..!!

ఎట్టకేలకు పూజా కల నెరవేరిందట.. పిచ్చ హ్యాపీగా ఉన్న బుట్టబొమ్మ..!!

పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఒక్కప్పుడు ఐరెన్ లెగ్ అన్న డైరెక్టర్స్ నే ఇప్పుడు ఈమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. వరస హిట్‌లు అందుకుంటూ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా తెలుగులో చక్రం తిప్పుతోంది ఈ హాట్ న్యూటి. ఇక ఆమె నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఫుల్ షూటింగ్స్ తో విసిగిపోయిన పూజ కొద్ది రోజులు మాల్దీవుల టూర్‌ను ఎంజాయ్‌ చేసి వచ్చింది. అక్కడ దిగ్గిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసింది.

ఇక ఈ అమ్మడు తాజాగా బీటౌన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఓ సెట్‌లో అడుగుపెట్టారు. అక్కడ బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ను కలిశారు. ఆ ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసి ఆనందం వ్యక్తం చేశారు. “బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసిన పూజ ఆయనతో కలిసి వర్క్ చేయాలి అని ఎప్పతినుండో అనుకుంటుందట. నిజానికి అది ఆమె కల్ అంతూ పోస్ట్ చేసింది. ఇక ఇప్పటికి ఇవాళ నా కల నెరవేరింది అంటూ చెప్పుకొచ్చింది.

ఇక నా కలల లిస్ట్‌లో అది టిక్ పెట్టేసుకోవచ్చు అని కూడా పోస్ట్ చేసింది. పూర్తి వివరాల కోసం ఎదురు చూడండి’ అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో ఈ సినిమా ఏంటన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రస్తుతం రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌ వంటి చిత్రాలతో బీజీగా ఉన్న పూజా నిర్మాతల పాలిట అదృష్ట దెవతగా మారిపోయింది. ఈమెతో సినిమా తీస్తే బాక్స్ ఆఫిస్ దగ్గర కాసుల వర్షం పక్క అని డైసైడ్ అయ్యిపోయిన్నట్లు ఉన్నారు నిర్మాతలు. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్కో సినిమాకి 4 నుండి 5 కోట్లూ రెమ్యూనరేషన్ గా తీసుకుంటుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news