Moviesఆ హీరో గురించి ర‌మ్య‌కృష్ణ‌పై చెప్పులు విసిరారా.. ఏం జ‌రిగింది..!

ఆ హీరో గురించి ర‌మ్య‌కృష్ణ‌పై చెప్పులు విసిరారా.. ఏం జ‌రిగింది..!

బాహుబ‌లిలో శివ‌గామీ దేవిగా యావ‌త్ ప్ర‌పంచాన్ని మెప్పించింది సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ‌. మూడు ద‌శాబ్దాలుగా సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా, టాప్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ర‌మ్య‌కృష్ణ రాణిస్తూనే ఉన్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీని పెళ్లి చేసుకున్న ర‌మ్య ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ర‌మ్య‌కృష్ణ హీరోయిన్‌గా అయినా, గ్లామ‌ర‌సం ఒల‌క బోయ‌డంలో అయినా, లేడీ విల‌న్‌గా అయినా, ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా అయినా, రాజ‌మాత‌గా అయినా.. దేవ‌త‌గా అయినా ఏ పాత్ర‌లో అయినా ఇట్టే ఒదిగిపోతుంది.

ఆమె న‌ట‌న‌కు వంక పెట్ట‌లేం. అలాంటి ర‌మ్య‌కృష్ణ ఓ సినిమాలో తెర‌మీద క‌నిపించ‌గానే చెప్పులు విసిరారు. ఆ సంఘ‌ట‌న ఆమె జీవితంలో ఎప్ప‌ట‌కీ పెద్ద మ‌చ్చ‌లాంటిదే. కేఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా న‌ర‌సింహా సినిమా వ‌చ్చింది. ఆ సినిమాలో ర‌జ‌నీకి ధీటుగా ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా ర‌మ్య‌కృష్ణ నీలాంబ‌రి పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమా ఎంత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో తెలిసిందే.

ఈ సినిమా తొలి రోజు షో చూసేందుకు ర‌మ్య‌కృష్ణ చెల్లి చెన్నైలో ఓ థియేట‌ర్‌కు వెళ్లింద‌ట‌. తెర మీద రమ్య కనిపించగానే జనాలు చెప్పులు విసిరారట. ఆ విషయం చెల్లి వ‌చ్చి ర‌మ్య‌కు చెప్ప‌డంతో ర‌మ్య ఏడ్చేసింద‌ట‌. అయితే ఆ సినిమా కు ఆ త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ రావ‌డంతో యేడాది పాటు ఎక్క‌డ చూసినా ర‌మ్య పాత్ర గురించే చెప్పుకుని ఆమెను మెచ్చుకునేవారు. ఆ త‌ర్వాత త‌న‌కు చాలా సంతోషం వేసింద‌ని ర‌మ్య చెప్పింది.

ఇక ర‌మ్య ఇటీవ‌లే సాయితేజ్ రిప‌బ్లిక్ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టించింది. నాగార్జున బంగార్రాజు సినిమాతో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాలో కూడా న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news