Moviesప్రభాస్ ను కాదన్న అరవింద్ స్వామి.. కారణం అదేనట..!

ప్రభాస్ ను కాదన్న అరవింద్ స్వామి.. కారణం అదేనట..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ యాక్షన్ విలన్స్ నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ లాంటి వారు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ గా మొదట అరవింద్ స్వామి నటిస్తాడని అనుకున్నారు.

కోలీవుడ్ లో జయం రవితో తని ఒరువన్ సినిమాలో నటించిన అరవింద్ స్వామి ఆ తర్వాత బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమాతో మళ్లీ హీరోగా కూడా అవకాశాలు రావడంతో ప్రభాస్ విలన్ గా చేసే ఛాన్స్ వచ్చినా కాదనేశాడట. తెలుగు, తమిళ, హింది భాషల్లో వస్తున్న ఈ సినిమాలో విలన్ గా చేస్తే నేషనల్ వైడ్ గా మళ్లీ విలన్ గానే అవకాశాలు వస్తాయని అరవింద్ స్వామి సాహో ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట.

తని ఒరువన్ తర్వాత జయం రవితో బోగన్ మూవీ చేసినా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. మరి హీరోగా మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తున్న అరవింద్ స్వామికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news