Moviesఆడియో ఆరోజే.. ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ ఎన్నో సర్ ప్రైజెస్..!

ఆడియో ఆరోజే.. ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ ఎన్నో సర్ ప్రైజెస్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా అంటే ఫ్యాన్స్ లో అదోరకమైన హుశారు మొదలవుతుంది. సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో హంగామా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆడియో ముహుర్తం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 3న పెట్టారని తెలుస్తుంది. అసలైతే హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న జై లవ కుశ ఆడియో రిలీజ్ చేద్దామని అనుకున్నారు.

ఆరోజు బిగ్ బాస్ షూటింగ్ ఉండటం వల్ల అది మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ కూడా అదరగొట్టేస్తుందని అంటున్నారు. ఇప్పటికే జై పాత్ర రివీల్ చేసి సినిమా మీద అంచనాలను పెంచేసిన దర్శకుడు బాబి లవకుమార్ టీజర్ ను ఈరోజు సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు.

ఇక జై లవ కుశ ఆడియోకి రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది. జై లవ కుశ మొదటి టీజర్ వచ్చాక సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్లే మొదటి స్టెప్ అదిరిందని చెప్పిన రాజమౌళి ఏకంగా సినిమా ఆడియోకి వచ్చి ఎలా సర్ ప్రైజ్ చేస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news