Moviesటైం చూసి పెంచేసిన కాజల్.. ఇక తిరుగులేదు..!

టైం చూసి పెంచేసిన కాజల్.. ఇక తిరుగులేదు..!

ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ లో ఫుల్ ఫాంలో ఉన్నది కాజల్ ఒక్కతే. టాప్ హీరోయిన్స్ అంతా దాదాపు పెట్టా బేడా సర్దేయడంతో కాజల్ కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. సమంత పెళ్లి అనగానే ఆమెను స్టార్ రేసులోంచి తొలగించారు. ఇక తమన్నా ఇప్పటికే ఫేడవుట్ అయ్యింది. తెలుగు తమిళంలో ఒకే రేంజ్ ఇమేజ్ ఉన్న భామ ప్రస్తుతం కాజల్ ఒక్కతే ఆప్షన్ అయ్యింది.

అందుకే ఆమెకు అడిగినంత పారితోషికం ఇచ్చి మరి అవకాశలు ఇస్తున్నారు. తెలుగులో నేనే రాజు నేనే మంత్రితో మరోసారి సత్తా చాటిన కాజల్ కళ్యాణ్ రాం తో ఎం.ఎల్.ఏ సినిమా చేస్తుంది. ఇక త్రివిక్రం ఎన్.టి.ఆర్ కాంబోలో కూడా హీరోయిన్ కాజల్ అనే అంటున్నారు. ఇవే కాకుండా అజిత్ వివేగం (వివేకం)లో నటించిన కాజల్ ఇళయదళపతి విజయ్ చేస్తున్న మెర్సల్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది.

ఛాన్స్ వచ్చింది కదా అని డిమాండ్ పెంచేసిందట కాజల్. ఇప్పటికే సినిమాకు కోటిన్నర దాకా వసూలు చేస్తున్న అమ్మడు ఇక నుండి 2 కోట్లు ఇచ్చేట్లయితేనే తన వద్దకు రండి అని అంటుందట. మొత్తానికి మళ్లీ కాజల్ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంది. మరో హీరోయిన్ టాప్ రేంజ్ లోకి వచ్చేదాకా కాజల్ కు తిరుగులేదని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news