Moviesరాజమౌళి తో ఓకే అంటున్న సాయిపల్లవి..?

రాజమౌళి తో ఓకే అంటున్న సాయిపల్లవి..?

టాలీవుడ్ దర్శకథీరుడు రాజమౌళి అంటే విజయాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. స్టూడెంట్ నెం.1 మూవీ నుంచి ఆయన ప్రస్తానం మొదలై బాహుబలి 2 వరకు విజయాలతో కొనసాగుతూ వచ్చింది. ఇక బాహుబలి సీరీస్ కేవలం టాలీవుడ్ లోనే కాదు జాతీయ స్థాయిలో సంచలనాలు నమోదు చేసుకుంది.

ప్రస్తుతం రాజమౌళి ఏ సినిమా తీసినా అది జాతీయ స్థాయిలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఒకప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ లకే సొంతమైని కలెక్షన్ల రికార్డు బాహుబలి 2 చెరిపేసింది. ప్రస్తుతం ఆయన రాంచరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ కూడా మొదలైంది.

ఇక టాలీవుడ్ లో ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి…తెలుగు, తమిళ,మళియాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ అనుకున్నా అది కుదరలేదు.

ఈ నేపథ్యంలో పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. అయితే నిత్యామీనన్ కి బదులుగా సాయిపల్లవిని తీసుకోనున్నారా? లేదంటే మరో పాత్ర కోసం సాయిపల్లవిని ఎంపిక చేస్తున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news