Gossipsఇస్మార్ట్ హిట్ తో బాలయ్యతో షూట్..

ఇస్మార్ట్ హిట్ తో బాలయ్యతో షూట్..

ఆ మద్య కృష్ణ వంశి తీసిన సినిమా ఖడ్గం గుర్తుంది కదా..అందులో రవితేజ డైలాగ్ ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో ఇండస్ట్రీకి చూపిస్తా అంటాడు. ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఇదే డైలాగ్ కొడుతున్నాడు. పూరి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ మూవీ తర్వాత వరుసగా డిజాస్టర్లు చవి చూస్తున్నాడు. ఒక్క హిట్ కోసం పరితపించిపోతున్నాడు. ఆ మద్య నందమూరి బాలకృష్ణ తో ‘పైసా వసూల్’లాంటి మాస్ మూవీ తీసినా సక్సెస్ కొట్టలేక పోయాడు.

తాజాగా పూరి, హీరో రామ్ పోతీనేని కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ థియేటర్లలో దుమ్మురేపుతుంది. మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న పూరి తన కల నెరవేర్చుకున్నాడు. పూరీ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లో పూరి మార్క్ చాటుకున్నాడు. దాంతో నిర్మాతలు మనోడి వైపు మళ్లీ చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు నందమూరి బాలయ్య కూడా పూరితో ఓ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి పైసా వసూల్ తర్వాత వీరి కాంబినేషన్ లో ఓ మూవీ రావాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఫెయిల్ కావడంతో వెనక్కి తగ్గాడట బాలయ్య. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ మూవీ సూపర్ హిట్ తో పూరి జోష్ లో ఉన్నాడు. బాలయ్య కూడా వరుస డిజాస్టర్లతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేష్ లో మరో మాస్ మూవీ రాబోతుందా వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news