Gossipsఎట్టకేలకు ఎన్టీఆర్ కు చిక్కుముడి విడిందా..

ఎట్టకేలకు ఎన్టీఆర్ కు చిక్కుముడి విడిందా..

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ ను సెలెక్ట్ చేశారు. డైసీకి డేట్స్ అడ్జెస్ట్ కావట్లేదని తెలిసి ఆమెను సినిమా నుండి తప్పించారు. ఇప్పుడు ఆ స్థానంలో ఎవరిని తీసుకున్నారో తెలియాల్సి ఉంది.

నిత్యా మీనన్, సాయి పల్లవి అంటూ వార్తలు వచ్చినా కావాల్సింది ఫారిన్ హీరోయిన్స్ కాబట్టి రాజమౌళి మరో ఇంగ్లీష్ భామని ఫైనల్ చేశాడట. హాలీవుడ్ హీరోయిన్ ఎమ్మా రాబర్ట్స్ ను ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. హాలీవుడ్ సినిమాలు చూసే ఆడియెన్స్ కు హెమ్మా రాబర్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నటించిన వైల్డ్ చైల్డ్, నెవ్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

అయితే మొదట ఆమెను స్క్రీన్ టెస్ట్ చేసి పాత్రకు సూట్ అవుతుందని భావిస్తే అప్పుడు అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారట. డైసీ ప్లేస్ లో ఎమ్మా ని ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఇక అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేసి 2020 జూలై 30న ఈ సినిమా వచ్చేలా షెడ్యూల్ చేస్తున్నాడట రాజమౌళి. మరి అనుకున్న టైం కు సినిమా రిలీజ్ చేస్తాడో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news