Gossipsబాల‌య్య మీద కోపంతో నాగ్ అలా చేశాడా..!

బాల‌య్య మీద కోపంతో నాగ్ అలా చేశాడా..!

హీరో ల మధ్య సాధారణంగా వైరం ఉంటుంది అది కేవలం వృత్తిపరంగానే ఉంటుంది. పర్సనల్ లైఫ్ లో ఒకరికొకరు చాలా క్లోజ్ గా ఉంటారు. ఒకరింట్లో శుభకార్యాలకు మరొకరు హాజరవుతుంటారు. ఒకరి సినిమా ఆడియో ఫంక్షన్ కి మరొకరు హాజరై శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోల మధ్య సరైన సఖ్యత లేదనే పుకార్లు సినీ ఇండ్రస్ట్రీలో హల్ చల్ చేస్తున్నాయి.

బాలకృష్ణ, నాగార్జునల మధ్య చాలా కాలంగా సఖ్యత లేదనేది సినీ ఇండస్ట్రీలో పాపులర్ రూమర్. నాగార్జున వున్న చోటకి బాలయ్య రాకపోవడం, ఇద్దరి ఇళ్లల్లో వేడుకలకి, పార్టీలకీ ఒకరిని ఒకరు పిలుచుకోకపోవడం ఆ రూమర్స్ ని బలపరిచింది. అక్కినేని మరణం సమయంలో నాగార్జునకి బాలయ్య సంతాపం తెలపకపోవడం, అక్కినేని భౌతికకాయాన్ని సందర్శించకపోవడంతో ఈ విబేధాలు తారాస్థాయిలో ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది. ఇద్దరి మధ్య వార్ కి రీజన్‌ ఏంటనేది తెలియకపోయినప్పటికీ ఈ సీనియర్ల మధ్య స్నేహబంధాలైతే లేవని ఫిలిం నగర్ టాక్.

ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మతో నాగార్జున ఇప్పుడు సినిమా చేయడం చర్చనీయాంశమయింది. రామ్‌గోపాల్‌వర్మ డైరెక్షన్‌లో బాలకృష్ణ తన చిరకాల స్వప్నమైన ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీద్దామని భావించాడు. అయితే బాలయ్య మాట వెనక్కి తీసుకుని తేజకి ఆ బాధ్యతలు అప్పగించాడు. ఇదే సమయంలో వర్మతో నాగార్జున సినిమా తీయబోతున్నాడు. ఈమధ్య ఆచితూచి సినిమాలు చేస్తోన్న నాగార్జున ఇప్పుడు సడన్‌గా వర్మకి ఎందుకు అవకాశమిచ్చినట్టు బాలయ్యతో విభేదాలకు దీనికి మధ్య ఏదైనా సంభంధం ఉందా ..? అనే సందేహాలతో ఇరువురి హీరోల ఫాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. బాల‌య్య మీద ఉన్న వైరంతో నాగ్ వ‌ర్మ‌కు ఛాన్స్ ఇచ్చాడా ? అని కొంద‌రు డౌట్ రైజ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news