Movies2023 లో మతులు పోయే విధంగా హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన...

2023 లో మతులు పోయే విధంగా హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీలు ఇవే..!!

2023 సినిమా ఇండస్ట్రీకి చాలా స్పెషల్. ఎంతో మంది హీరోలకు గుర్తుండిపోయేలా చేసింది . అంతేకాదు మన డార్లింగ్ ప్రభాస్ కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న హిట్ కూడా ఇచ్చింది. ఇలాంటి క్రమంలోని చాలామంది హీరోలకు గుర్తుండిపోయే హిట్లను ఇచ్చింది 2023 .ఈ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మూవీలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

సలార్: ఇటీవల రిలీజ్ అయిన ప్రభాస్ సలార్ పార్ట్ వన్ సిజ్ ఫైర్ సినిమా ఇప్పటికే 550 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ ఇయర్ తెలుగు సినిమాలలో అన్నిటికన్నా టాప్ ప్లేస్ లో ఉంది .

వాల్తేరు వీరయ్య: చిరంజీవి రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా ఏకంగా 236 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అభిమానులను షాకింగ్ కి గురిచేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఫ్లాప్ అంటూ ప్రచారం చేశారు కొందరు . కానీ సీన్ మాత్రం అదిరిపోయింది .

వీరసింహారెడ్డి : బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 134 కోట్లు కలెక్ట్ చేసి ఊర మాస్ రేంజ్ లో బాలయ్య ఫ్యాన్స్ ను పెంచేసింది .

సార్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. సంయుక్తమైన హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో చాలా చాలా కంటెంట్ ఉంది .అందుకే ఈ సినిమాని హిట్ చేసి పెట్టారు తెలుగు తమిళ్ ప్రేక్షకులు . ఏకంగా 118 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనాన్ని సృష్టించింది .

దసరా: నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా మారింది. నానిని 100 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది . ఈ సినిమా 115 కోట్లు కలెక్ట్ చేసింది .

భగవంత్ కేసరి” వీర సింహారెడ్డి తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న బాలయ్య ఫ్యాన్స్ కు ఈ సినిమా మంచి కిక్ ఇచ్చింది. ఈ సినిమా 110 కోట్లు కలెక్ట్ చేసింది. అనిల్ రావిపూడి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు .

విరూపాక్ష:సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత ఒక హిట్ కూడా పడని సాయి ధరమ్ కు ఈ సినిమా గుర్తుండిపోయే హిట్ ఇచ్చింది. విరూపాక్ష సినిమా 113 కోట్ల క్రాస్ చేసి మెగా హీరోని వంద కోట్లు హీరోగా మార్చేసింది .

బేబీ : ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా 90 కోట్ల వరకు వసూలు చేసింది .

బ్రో : పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమా టికెట్లు రేట్లు తగ్గించేసారే కాని లేకపోతే ఈ సినిమా 100 కోట్లు దాటేసుండేది.

ఖుషి : సమంత – విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఈ సినిమా 76 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news