Moviesఅప్పుడు సినిమాల కోసం.. ఇప్పుడు ఏకంగా దాని కోసమే.. వేణు స్వామీని...

అప్పుడు సినిమాల కోసం.. ఇప్పుడు ఏకంగా దాని కోసమే.. వేణు స్వామీని రష్మిక బాగా వాడేసుకుంటుందిగా ..!!

రష్మిక మందన్నా.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఛలో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో పలు సినిమాలో నటిస్తూ క్రేజీ పాపులారిటీ సంపాదించుకుంది . పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న రష్మిక యానిమల్ సినిమాతో మరింత స్థాయిలో తన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకుంది.

కాగ యానిమల్ సినిమా హిట్ అయిన తర్వాత రష్మికకి హ్యూజ్ పాపులారిటీ పెరిగిపోయింది . అంతేకాదు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఆమెను చూసి కుళ్ళు కుంటున్నారు . ఈ క్రమంలోనే రష్మిక మందన్నా తల్లి వేణు స్వామి తో చెప్పి స్పెషల్ గా ఆయన చేత దిష్టి తీయించి మరి పూజలు చేయించిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . గతంలో రష్మిక – వేణు స్వామి తో సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టాలి అంటూ పూజలు చేయించుకుంది .

ఆ ఫలితమే ఇప్పుడు ఆమెను పాన్ ఇండియా హీరోయిన్ ను చేసింది . ఇప్పుడు ఆయనను ఇంటికి పిలిపించి మరి దిష్టి తీయించుకుని ప్రత్యేక పూజలు చేయించుకుంది అన్న వార్త వైరల్ అవుతుంది. కాగా ప్రజెంట్ రష్మిక తెలుగులో రెండు సినిమాలు.. తమిళంలో ఒకటి.. బాలీవుడ్ లో ఏకంగా నాలుగు సినిమాల్లో నటిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news