Movies"ఆ ఒక్క సీన్ చూశాక ఒక్కోక్కడికి తడిసిపోవాల్సిందే"..సలార్ పై ప్రభాస్ రోమాలునిక్కబొడుచుకునే...

“ఆ ఒక్క సీన్ చూశాక ఒక్కోక్కడికి తడిసిపోవాల్సిందే”..సలార్ పై ప్రభాస్ రోమాలునిక్కబొడుచుకునే కామెంట్స్..!

వామ్మో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటించిన సలార్ సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ గా మారింది. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ప్రభాస్ మానియా చూస్తుంటే ఓపెనింగ్ కలెక్షన్స్ నెంబర్ బిఫోర్ అన్నట్లుగా సునామీ సృష్టించబోతున్నాయి అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు సలార్ జోష్ పెంచేందుకు రాజమౌళి కూడా రంగంలోకి దిగారు. ప్రశాంత్ నిల్ – ప్రభాస్ – పృధ్విరాజ్ ని రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు . ఈ ఇంటర్వ్యూలలో అనేక ప్రశ్నలు అడిగారు రాజమౌళి . శృతిహాసన్ గురించి అడిగిన ప్రశ్న దానికి ప్రభాస్ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది.

“ట్రైలర్లో శృతిహాసన్ కి ఒక్క డైలాగ్ మాత్రమే ఉంది . ఒక షాట్ లోనే కనిపిస్తుంది .ఎక్కువగా ప్రభాస్ పృథ్వీరాజ్ లో కనిపిస్తారు . అసలు ఆమెకి ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ ఉందా..? అంటూ ప్రశ్నిస్తారు .అయితే రాజమౌళి ఇంటర్వ్యూలో ప్రభాస్ ప్రశాంత్ నీల్ చెప్పిన ఆన్సర్ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది . “ఎలివేషన్స్ కంటే డ్రామా ప్రధానంగా ఉంటుంది ఈ సినిమాలో. పృథ్వీరాజ్ కి ప్రభాస్ కి మధ్య ఉండే డ్రామా ఆకట్టుకుంటుంది . అలాగే తల్లి పాత్రకి తనకి శృతిహాసన్ కి మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ హైలైట్ అవుతాయని ప్రభాస్ చెప్పుకొచ్చారు .

అంతేకాదు ఈ సినిమాలో శృతిహాసన్ క్యారెక్టర్ చెప్పే ఒక డైలాగ్ అభిమానులకు బాగా నచ్చుతుంది ” అంటూ కూడా ప్రభాస్ చెప్పి హైప్స్ పెంచేశారు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ప్రభాస్ ఇప్పుడు సినిమకి సంబంధించిన ఒక్కో ఒక్కో సీన్ చెప్తుంటే ఫ్యాన్స్ కి మతులు పోతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news