Moviesఅభిమానులకి ఘట్టమనేని హీరో బిగ్ షాక్.. అందరు అనుకున్నట్లే చేశాడుగా..కొంప ముంచేశావ్...

అభిమానులకి ఘట్టమనేని హీరో బిగ్ షాక్.. అందరు అనుకున్నట్లే చేశాడుగా..కొంప ముంచేశావ్ మహేశ్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు అభిమానులు అనుకున్న విధంగానే చేశాడా అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మహేష్ బాబు ఫ్యామిలీలతో టూర్లు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు కనీసం సంవత్సరానికి ఒక మూడు నాలుగు అయినా సరే టూర్లకి వెళ్లకుండా మానడు.. సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా సరే షూట్ ని ఆపుకోనైనా సరే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాడు .

ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే ప్రెసెంట్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలి . జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది . పట్టుమంటే 15 రోజులు కూడా లేవు సినిమా రిలీజ్ కి . అయితే ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు తన ఫ్యామిలీతో దుబాయ్ కి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . అయితే మహేష్ బాబు దుబాయ్ కి వెళ్ళింది యాడ్ షూట్ కోసం అంటూ తెలుస్తుంది .

అంతే కాదు పనిలో పని ఫ్యామిలీ వెకేషన్ ని కూడా న్యూ ఇయర్ సందర్భంగా ఎంజాయ్ చేసేయొచ్చు అంటూ ఈ నిర్ణయం తీసుకున్నారట . నిజానికి మహేష్ బాబు లిస్టులో ఈ ఇయర్ ..న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇండియాలోనే జరగాలి . గుంటూరు కారం ప్రమోషన్స్ ను బాగా చేయాలి . అయితే సడన్గా యాడ్ షూట్ ఓకే అవ్వడంతో ఫ్యామిలీతో అప్పటికప్పుడు దుబాయ్ కి వెళ్లడానికి ఫిక్స్ అయిపోయారట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు. కరెక్ట్ గా 15 రోజులు కూడా లేవు. నువ్వు ఎప్పుడు వెళ్లి ఎప్పుడు వస్తావు.. సినిమాకి ప్రమోషన్స్ ఎప్పుడు చేస్తావ్ ..అసలే గుంటూరు కారం గురించి సోషల్ మీడియాలో చెత్త చెత్త అంతా ట్రోల్ అవుతుంది. ఏంటో పో మహేష్ బాబు అంటూ జనాలు అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news