Movies"పిలల్ని కన్నవాళ్లకి ఆ మాత్రం తెలియదా..?".. మరొసారి రెచ్చిపోయిన యాంకర్ రష్మి..!!

“పిలల్ని కన్నవాళ్లకి ఆ మాత్రం తెలియదా..?”.. మరొసారి రెచ్చిపోయిన యాంకర్ రష్మి..!!

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే యాంకర్ రష్మి తాజాగా పెట్టిన పోస్ట్ అభిమానులకు షాకింగ్ గా అనిపిస్తుంది . మనకు తెలిసిందే యాంకర్ రష్మీ జంతు ప్రేమికురాలు. జంతువులను ఏమన్నా అంటే అస్సలు తట్టుకోలేరు . ఓ రేంజ్ లో ఇచ్చి పడేస్తుంది . కాగా రీసెంట్గా వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ ఐదు నెలల చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేయడంతో ఆ చిన్నారి మరణించిన విషయం అందరికీ తెలిసిందే .

ఇది తెలుసుకున్న జనాలు బాగా డీప్ గా బాధపడిపోయారు . అంతేకాదు ఆ చిన్నారి పేరెంట్స్ దాడి చేసిన కుక్కను కిరాతకంగా కొట్టి చంపేశారు . ఈ ఘటనపై ఓ నెటిజన్ స్పందిస్తూ..” ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రులపై కేసు పెట్టాలి అని రష్మి గౌతమ్ అంటున్నది “అంటూ ట్విట్ చేయగా ఆమె దీనిపై రియాక్ట్ అవుతూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చింది . “పేరెంట్స్ ఆ చిన్నారిని అసలు ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారు..?’

“కుక్క దాడి చేస్తున్న టైంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నిద్రపోతున్నారా? పిల్లల్ని కంటారు.. బాధ్యతగా వ్యవహరించడం తెలియదా ..? జంతువులపై చెత్త ప్రచారాన్ని ఆపండి..” అంటూ కామెంట్ పెట్టింది. ” పిల్లల జీవితాలను రిస్క్ లో పెట్టింది ఎవరు..? అంటూ తల్లిదండ్రులను వేలెత్తి చెప్పింది. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లల్ని వదిలేయకండి “అంటూ రిక్వెస్ట్ చేసింది . సోషల్ మీడియాలో ఇప్పుడు రష్మీ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది . ఈ విషయంలో కొందరు రష్మీకి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు రష్మిని దుమ్మెత్తి పోస్తున్నారు. నువ్వు బిడ్డల్ని కను అప్పుడు ఆ బాధ నీకు తెలుస్తుంది అంటూ సూటిగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news