Newsఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ఆరు నెల‌లు అడ్ర‌స్ లేకుండా పోయిన...

ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ఆరు నెల‌లు అడ్ర‌స్ లేకుండా పోయిన హీరో, హీరోయిన్‌…!

రోజా సినిమాతో తెలుగులోనూ సూప‌ర్ హిట్ కొట్టి అభిమానుల‌ను సంపాయించుకున్న హీరో హీరోయిన్లు.. మ‌ధుబాల‌, అర‌వింద స్వామి. ఈ సినిమా 1993లో వ‌చ్చి.. దాదాపు అప్ప‌ట్లోనే ఏడాది ఆటు ఆడింది. ఇది కుటుంబ ప్రేమ‌క‌థా చిత్రంతోపాటు.. సోషియో ఫాంట‌సీ సినిమాగా కూడా పేరుసంపాయించుకుంది. సంగీత ద‌ర్శ‌కుడు ఏ ఆర్ రెహ‌మాన్ ఆల్బ‌మ్‌లో ఈ సినిమాకు ప్ర‌త్యేక స్థానం కూడా ఉంది.

ఇక‌, ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నానికి మ‌రింత మంచి పేరు తీసుకువ‌చ్చింది. అయితే.. ఈ సినిమాలో న‌టించిన మ‌ధుబాల‌.. త‌ర్వాత‌.. చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు. త‌ర్వాత వ‌చ్చిన అర్జున్ సినిమాలో న‌టించారు. ఇక‌, అర‌వింద స్వామి కూడా కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నారు. అయితే.. ఈ గ్యాప్ అప్ప‌టి సినీ ప‌రిశ్ర‌మంలో సంచ‌ల‌నం సృష్టించింది. రోజా సినిమాలో ప్రేమికులుగా.. త‌ర్వాత వివాహం చేసుకున్న భార్యాభ‌ర్త‌లుగా హిట్ కొట్టిన ఈ జంట ప్రేమలో ప‌డ్డార‌నేది సినీ టాక్‌.

ఇది నిజ‌మేన‌ని అనేక ప‌త్రిక‌లు కూడా అప్ప‌ట్లో రాసుకొచ్చాయి. ఇప్ప‌టి మాదిరిగా సోష‌ల్ మీడియా పుంజుకోక‌పోవ‌డంతో దీనిపై పెద్ద‌గా ప్ర‌చారం రాలేదు. ఇక‌, రోజా హిట్ త‌ర్వాత‌.. వీరిద్ద‌రూ అకేష‌న్‌కు కూడా వెళ్లిపోయార‌ని.. క‌లిసి ఉన్నారని త‌మిళ ప‌త్రిక‌లు వ్యాఖ్యానించాయి. దాదాపు ఆరుమాసాల పాటు ఈ ఇద్ద‌రు క‌నిపించ‌క‌పోవ‌డం.. సినిమాల‌కు కూడా దూరంగా ఉండ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య లవ్ నిజ‌మ‌నే వాద‌న స్థిర‌ప‌డింది. అయితే.. అటు మ‌ధుబాల కానీ, ఇటు అర‌వింద‌స్వామి కానీ, దీనిపై క్లారిటీ ఇవ్వ‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news