Newsఫైనల్లీ..అతనితో "జనగణమన"ని తెరకెక్కించబోతున్న పూరి.. లాస్ట్ కి ఆ హీరో...

ఫైనల్లీ..అతనితో “జనగణమన”ని తెరకెక్కించబోతున్న పూరి.. లాస్ట్ కి ఆ హీరో బకరా అవుతున్నాడా..?

వామ్మో .. ఏంటిది మళ్లీ పూరి జగన్నాథ్ తన డ్రీం ప్రాజెక్టును తెరపైకి తెస్తున్నాడా..? ఎన్నిసార్లు అనౌన్స్ చేసి ఎన్నిసార్లు రిజెక్ట్ చేస్తారు రా బాబు అంటూ పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ నే అసహనం వ్యక్తం చేస్తున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ప్రెసెంట్ ఒక్క సినిమా హిట్ కొడితే చాలు నా జన్మ ధన్యమే అన్నట్టు ఉండిపోయాడు . అయితే దేవుడు ఇంకా కరుణించలేదు . వరుస ఫ్లాప్ లతో సతమతమైపోతున్నాడు .

భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన లైగర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది . దీంతో ఉన్న పరువు కాస్త పోయింది. అంతేకాదు విజయ్ దేవరకొండ జనగణమన ప్రాజెక్టుకు కమిట్ అయ్యాడు . ఆయన కూడా ఈ దెబ్బకు భయపడి పోయి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు . మొదట ఈ ప్రాజెక్టును రవితేజతో తెరకెక్కించాలనుకున్నారట . ఆయన రిజెక్ట్ చేస్తే ఆ తర్వాత మహేష్ బాబుతో తెరకెక్కించాలని మొత్తం అనౌన్స్ కూడా చేశారట . ఆ తర్వాత మహేష్ బాబు రిజెక్ట్ చేస్తే ఫైనల్లీ లైగర్ చేస్తున్న టైంలో విజయ్ దేవరకొండకు కథ వినిపించి కమిట్మెంట్ తీసుకున్నాడట పూరి.

లైగర్ కూడా దొబ్బేయడంతో విజయ్ దేవరకొండ వెనక్కి తప్పుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆ లిస్టులోకి రామ్ పోతినేని వచ్చినట్లు తెలుస్తుంది . ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వీళ్ళ కాంబో మంచి హిట్ పెయిర్ గా నిలిచింది . అంతేకాదు ప్రెసెంట్ డబుల్ ఇస్మార్ట్ లో నటిస్తున్నాడు . “ఈ సినిమా హిట్ అయిన ఫ్లాపైన జనగణమన ప్రాజెక్టులో నేను నటిస్తాను.. మీ కోరిక నెరవేరుస్తాను అంటూ ప్రామిస్ చేశాడట రామ్ పోతినేని”. దీంతో పూరి జగన్నాథ్ జనగణమన డ్రీం ప్రాజెక్టు మళ్ళీ తెరపైకి రాబోతుంది అన్న వార్త వైరల్ అవుతుంది. దీంతో ఈసారి బకరా అయ్యేది రామ్ పోతినేని నా..? అంటూ వ్యంగంగా కౌంటర్స్ వేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news