Newsబుక్ మై షో టిక్కెట్ల బుకింగ్‌లో ' భ‌గ‌వంత్ కేస‌రి...

బుక్ మై షో టిక్కెట్ల బుకింగ్‌లో ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ సెన్షేష‌న్ రికార్డ్‌… బాల‌య్య రికార్డుల జోర‌య్యా…!

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్‌ కేసరి. ఈ సినిమా దసరా కనుకగా ఈ నెల 19న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పటికే 12 రోజులకు గాను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ళ‌ను కొల్లగొట్టింది. అలాగే ఈ సినిమా షేర్ రూ.65 కోట్లు దాటేసింది.

బాలయ్య కెరీర్ లో అఖండ – వీరసింహారెడ్డి తర్వాత వరుసగా మూడో హిట్ సినిమాగా నిలిచింది. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించ‌గా, యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటించింది. బాలీవుడ్ సీనియర్ హీరో అర్జున్ రాంపాల్ విల‌న్‌గా నటించారు. ఈ సినిమా ఇప్పటికే బుక్ మై షోలో సెన్సేషనల్ రికార్డులు తన ఖాతాలో వేసుకుంది.

తాజాగా బుక్ మై షో లో భగవంత్‌ కేసరి సినిమాకు ఒకటే పాయింట్ 23 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఈ విషయాన్ని మేకర్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఆన్లైన్ అయినా.. ఆఫ్ లైన్ అయినా భగవంత్‌ కేసరి జోరు కొనసాగుతూనే ఉంది. మరో రెండు వారాలపాటు బాక్సాఫీస్ దగ్గర భగవంత్‌ కేసరి ప్రభంజనం కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక బాలయ్య తన 109వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఏదేమైనా భ‌గ‌వంత్ కేస‌రితో బాల‌య్య రికార్డుల జోరు మామూలుగా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news