Moviesఎన్టీఆర్ అభిమానులకు బిగ్ షాక్ ..మరో ఊహించని ఎదురు దెబ్బ..ఎక్కడి నుంచి...

ఎన్టీఆర్ అభిమానులకు బిగ్ షాక్ ..మరో ఊహించని ఎదురు దెబ్బ..ఎక్కడి నుంచి దాపరించారు రా మీరు..!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ పేరుని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో జనాలు మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ ని హైలెట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ని తక్కువ చేస్తూ చాలామంది ట్రోల్ చేశారు . అయితే ఎన్టీఆర్ – రామ్ చరణ్ అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. కాగా చరణ్ మాత్రం ఓ రేంజ్ లో హైపిస్తూ పొగిడేస్తూ ఎన్టీఆర్ ని పట్టించుకోకుండా మానేశారు . స్టార్ సెలబ్రిటీస్ ఈ విషయంపై నందమూరి ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు.

అప్పటినుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం కారణంగా ఎన్టీఆర్ని ట్రోలింగ్కి గురయ్యాలా చేస్తూనే ఉన్నారు ఆకతాయిలు. తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా విషయంలో సైతం అదే ట్రోలింగ్ ఎదుర్కొనేలా చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోయే సినిమాకి సంబంధించిన మూవీ టైటిల్ కి రిలేటెడ్ గా ఒక న్యూస్ వైరల్ అయింది . వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న మూవీకి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టారు అంటూ వార్తలు వినిపించాయి. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది . ఎందుకంటే మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాబోతుంది.

ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీల్ చేయబోతున్నారు . కాగా ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కి షాక్ ఇస్తూ మేకర్స్ డ్రాగన్ పేరుతో మరొక మూవీని ప్రకటించారు. అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు . ఈ సినిమాలో నటించే నటీ నటుల డీటెయిల్స్ తెలియాల్సి ఉంది . ఇది ఒక తమిళ్ సినిమా అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . ఇప్పటికి ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తమ టైటిల్ని మారుస్తారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కావాలనే ఎన్టీఆర్ ని ఇరికించడానికి కొందరు ఇలా చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు .మరికొందరు ఎక్కడినుంచి దాపురిస్తారు రా మీరు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . మొత్తానికి ఎన్టీఆర్ ని డౌన్ ఫాల్ చేసేందుకు ఓ టీం భారీగానే కుట్ర చేస్తుంది అంటూ ప్రచారం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news