Newsవిడాకులు తీసుకున్న నాగ‌చైత‌న్య - స‌మంత‌ను రెండేళ్లుగా టార్గెట్ చేస్తోందెవ‌రు... అస‌లేం...

విడాకులు తీసుకున్న నాగ‌చైత‌న్య – స‌మంత‌ను రెండేళ్లుగా టార్గెట్ చేస్తోందెవ‌రు… అస‌లేం జ‌రుగుతోంది ?

అక్కినేని హీరో నాగచైతన్య, సమంత ఆరేడు సంవత్సరాలుగా ప్రేమించుకుని 2017 లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్నాక నాలుగేళ్లు కూడా కాపురం చేయకుండానే 2021 చివర్లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఇటు సినిమాలు చేస్తూనే.. అటు వెబ్ సిరీస్‌లలో కూడా మెరుస్తున్నారు. విచిత్రం ఏంటంటే విడాకులు తర్వాత అటు చైతు సినిమా కెరియర్.. ఇటు సమంత సినిమా కెరియర్ అయితే ఆశాజనకంగా లేవు.

అయితే సమంత నటించిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఎప్పటికైనా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆమె సిటాటెల్ వెబ్ సిరీస్‌తో అమెజాన్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా ఏం జరిగిందో తెలియదు కానీ అమోజాన్‌ రిలీజ్ చేయకుండా వాయిదా వేస్తూ వస్తుంది.

అలాగే సమంత మాజీ భర్త నాగచైతన్య నటించిన ధ‌త వెబ్‌సీరిస్ సైతం స్ట్రీమింగ్ చేయకుండా అమెజాన్ దాదాపు రెండేళ్లుగా హోల్డ్ లో పెట్టింది. ఇలా సమంత, నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ ను అమెజాన్ ఎప్పటికి స్ట్రీమింగ్ చేస్తుందో క్లారిటీ లేదు. దీంతో అటు చైతు ఇటు సమంత ఇద్దరి అభిమానులు కూడా అమెజాన్ పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమోజాన్ ఈ మాజీ భార్య‌భ‌ర్త‌లిద్ద‌రిని కావాల‌నే టార్గెట్ చేస్తోందంటూ ఫైర్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news