Newsఆ హీరోయిన్‌పై మ‌న‌సు ప‌డ్డ మ‌హేష్.. రాజ‌మౌళికి పెట్టిన కండీష‌న్ ఇదే..!

ఆ హీరోయిన్‌పై మ‌న‌సు ప‌డ్డ మ‌హేష్.. రాజ‌మౌళికి పెట్టిన కండీష‌న్ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. గత యేడాది పరశురామ్‌ దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా ఇదే. ఇక ఖలేజా తర్వాత 13 ఏళ్ల లాంగ్ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్- మహేష్ కలిసి పని చేస్తున్నారు. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టు పై అంచనాలు మామూలుగా లేవు. త్రివిక్రమ్ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి ప్రాజెక్టులో జాయిన్ అవునన్నాడు మహేష్.

రాజమౌళి- మహేష్ కాంబినేషన్లో సినిమా కోసం 20 ఏళ్లుగా టాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది. సంక్రాంతి నుంచి రాజమౌళి ప్రాజెక్టు కోసం మహేష్ పని చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతోంది. రాజమౌళి మాత్రం ఈ సినిమా కోసం మార్కెట్ పరంగా ఆలోచించి ఎవరిని పెడితే ఎంత ఎక్కువ బిజినెస్ ? జరుగుతుంది.. పాన్ ఇండియా లెవెల్ లో కాదు పాన్ వరల్డ్ మార్కెట్ గా ఆలోచించి ప్రతిదీ ఆచితూచి ప్లాన్ చేస్తున్నారు.

అయితే మహేష్ బాబు పక్కన నటించే హీరోయిన్ విషయంలో చాలా చర్చలు నడుస్తున్నాయట. ప్రియాంక చోప్రా, అలియా భట్ ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే మహేష్ బాబు మాత్రం శృతిహాసన్‌ను రికమండ్‌ చేస్తున్నాడట. వీరిద్దరి కాంబినేషన్లో శ్రీమంతుడు లాంటి సూపర్ డూపర్ హిట్ వచ్చింది. ఆ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ కు జనాల్లో మంచి క్రేజ్ ఉంది. మరోసారి శృతిహాసన్‌తో కలిసి నటించాలని మహేష్ అనుకున్నా ఆ కోరిక నెరవేరలేదు.

తాజాగా ప్రభాస్ సలార్ సినిమాలోను శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె పాన్ ఇండియా వైడ్‌ గా సూపర్ పాపులర్ అవుతుంది. అందుకే మహేష్ తన సినిమాలో శృతిహాసన్‌ను తీసుకుంటే ఇబ్బంది ఉండదని భావిస్తున్నాడట. రాజమౌళి కన్ను మాత్రం ఓ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పై ఉందని తెలుస్తోంది. మరి మహేష్ బాబు చెప్పినట్టు రాజమౌళి వింటాడా ? శృతిహాసన్ కు మరోసారి మహేష్ బాబు పక్కన ఛాన్స్ దక్కుతుందా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news