Moviesఎన్టీఆర్ - నాగార్జున - ప‌వ‌న్ మ‌ధ్య ట్ర‌యాంగిల్ ఫైట్‌… విన్న‌ర్...

ఎన్టీఆర్ – నాగార్జున – ప‌వ‌న్ మ‌ధ్య ట్ర‌యాంగిల్ ఫైట్‌… విన్న‌ర్ ఎవ‌రో …!

టాలీవుడ్ స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్మధుడు నాగార్జున సినిమాల మధ్య ఆసక్తికరమైన ట్రయాంగిల్ ఫైట్ జరగనుంది. ఈ ముగ్గురు హీరోల మధ్య జరిగే ఈ ఫైటింగ్లో ఎవరు ?విన్నర్ అవుతారు అన్నది ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర హాట్‌ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే ప్రస్తుతం తెలుగులో బాగా నడుస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆ హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచిన సినిమాలతో పాటు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలను కూడా మరోసారి థియేటర్లలో వేస్తున్నారు. నిర్మాతలు కేవలం హీరోల‌ పుట్టినరోజు సందర్భంగా మాత్రమే కాకుండా ఆ సినిమాలు రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా వాటిని రీ రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలు అదిరిపోయే వసూళ్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు నెల చివరలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఆగస్టు 29న టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో క్లాసిక్ సినిమాలలో ఒకటైన మన్మథుడు సినిమా రీరిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 30న రాఖీ పండుగా సందర్భంగా ఎన్టీఆర్ కెరీర్ లో స్పెషల్ మూవీ గా నిలిచిన రాఖీ సినిమాను రీ రిలీజ్‌ చేస్తున్నారు.

ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా రెండు రోజులు ముందు అంటే ఆగస్టు 31న పవన్ కళ్యాణ్ డిజాస్టర్ మూవీ గుడుంబా శంకర్ ని రీరిలీజ్ చేస్తున్నారు. మరి ఈ ముగ్గురు స్టార్ హీరోల రీ రిలీజ్ లో ఎవరి సినిమా పై చేయి సాధిస్తుంది.. ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లు రాబడుతుంది అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news