Moviesజాన్వీ ఎక్కువ శ్రీవారిని దర్శించుకోవడానికి వెనుక ఉన్న రీజన్ అదేనా..? ముంబై...

జాన్వీ ఎక్కువ శ్రీవారిని దర్శించుకోవడానికి వెనుక ఉన్న రీజన్ అదేనా..? ముంబై తెలివితేటలు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల అతిలోకసుందరి శ్రీదేవికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నా సరే అందరూ శ్రీదేవి – శ్రీదేవి – శ్రీదేవి అంటూ జపం చేసేవారు. దానికి కారణం అందం ఓ పాయింట్ అయితే.. ఎటువంటి రోల్స్ నైనా సరే అవలీలగా నటించే సత్తా ఉన్న నటి కావడం మరో పాయింట్ అని చెప్పాలి . ఆమె కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ అందాలపరంగా నెట్టుకు వస్తుంది ..కానీ ఇప్పటివరకు నటన పరంగా ఒక్కటంటే ఒక్కటి హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు .

కనీసం తెలుగులో డబ్బింగ్ ఇచ్చిన దేవర సినిమాతో అయినా ఆమె ఇండస్ట్రీలో ఫస్ట్ హిట్ అందుకుంటుంది అన్న ఆశలు ఉన్నాయి. కాగా ఇలాంటి క్రమంలోనే జాన్వి కపూర్ రీసెంట్గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నింది. లంగా వోణీలో చాలా ట్రెడిషనల్ లుక్స్ లో అమ్మను తలపించే రేంజ్ లో కనిపించింది. అయితే ఎక్కువ మంది హీరోయిన్స్ ఇలా దైవదర్శనాలు చేసుకోరు. చాలా రేర్ గానే దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. కానీ జానికపూర్ మాత్రం సంవత్సరానికి ఓ ఆరు ఏడు సార్లు అయినా . సరే జాన్వి కపూర్ శ్రీవారిని దర్శించుకుంటుంది దాని వెనక పెద్ద రీజనే ఉంది అంటూ తెలుస్తుంది.

నిజానికి జాన్వి కపూర్ అమ్మగారు శ్రీదేవికి తిరుమల శ్రీవారు చాలా చాలా ఇష్టం . ఆమె ఏ సినిమా స్టార్ట్ చేయాలనుకున్న ఏ మంచి పని చేయాలనుకున్న ఏ ప్రాజెక్టు ను మొదలు పెట్టాలన్న ముందుగా స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తుందట . మొదటి నుంచి అవి దగ్గర నుంచి గమనించిన జాన్వికి అదే అలవాటు వచ్చిందట . అందుకే ఆమె ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకున్న మంచి పనులు స్టార్ట్ చేయాలనుకున్న దేవుడు ఆశీర్వాదాలు తీసుకొని మరి స్టార్ట్ చేస్తుందట . అందుకే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఎక్కువగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news