Moviesఆ సినిమా షూటింగ్ టైంలో రాజమౌళి ని రాళ్లతో కొట్టిన జనాలు.....

ఆ సినిమా షూటింగ్ టైంలో రాజమౌళి ని రాళ్లతో కొట్టిన జనాలు.. ఎందుకంటే..?

దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఏకంగా ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు . ఇది రెండు పార్టులుగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు మహేష్ బాబు ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా అద్భుతమైన లుక్స్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగ రాజమౌళికి సంబంధించిన కొన్ని విషయాలు సైతం ఇదే మూమెంట్లో ట్రెండ్ అవుతున్నాయి .

తన 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో రాజమౌళి చాలా కొన్ని సినిమాలే తీసాడు. కాని తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ఓ సినిమా తెరకెక్కించే టైంలో మాత్రం ఆయన పై రాళ్లదాడి జరిగింది . ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ సినిమా మరేదో కాదు రవితేజ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విక్రమార్కుడు .

ఈ సినిమా షూటింగ్ 3 నెలల్లో పూర్తి చేసేసారట రాజమౌళి . షూటింగ్లో భాగంగా కొన్ని సన్నివేశాలను కర్ణాటకలోని ఒక క్వారీలో తెరకెక్కించారు. సినిమా షూట్ అయ్యేవరకు క్యారీ కూలీలు ఖాళీగానే కూర్చున్నారట. అంతేకాదు ఆ రోజు క్యారీ ఓనర్ ఆ కూలి వాళ్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో .. వాళ్లకి కోపం వచ్చి రాజమౌళి పై రాళ్లు కూడా విసిరారట . మా డబ్బులు మాకు రాయకపోవడానికి కారణం ఏ సినిమా వాళ్ళే అంటూ కోపంతో అక్కడ ఉండే మహిళలు -పురుషులు రాళ్లతో సినిమా యూనిట్ వాళ్ళని కొట్టారట . అప్పట్లో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అంతే కాదు రాజమౌళి సైతం తీవ్రంగా గాయాలు పాలయ్యాడట. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . అలా కూలీల చేతుల్లో రాజమౌళి దెబ్బలు తిని మరి ఈ సినిమా హిట్ సాధించుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news