Moviesరావణాసుర సినిమాని చూసి సంబరపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. అసలు రీజన్ తెలిస్తే...

రావణాసుర సినిమాని చూసి సంబరపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. అసలు రీజన్ తెలిస్తే దండేసి దండం పెట్టేస్తారు..!!

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా రావణాసుర . స్వామి రారా సినిమా డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా నిన్ననే థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . కాగా సూపర్ గా ఉన్న కానీ యాక్షన్ త్రిల్లర్ సినిమా కావడంతో కొందరు జనాలు సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు . మరి ముఖ్యంగా కామెడీ హీరో రవితేజ మాస్ యాక్షన్ సీన్స్ లో నటించడం ఓ బిగ్ రిస్క్.. అయితే ఆ హీరో నుండి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇలాంటి థ్రిల్లర్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయమంటున్నారు కొందరు జనాలు .

ఇలా ఉంటే రావణాసుర షోలు పడుతున్న థియేటర్స్ లో ఓ సీన్ వచ్చినప్పుడు మాత్రం జనాలు అరుపులు కేకలతో ఊగిపోతున్నారు. మరీ ముఖ్యంగా థియేటర్లో వచ్చే అరుపులు బయటకు కూడా వినపడుతున్నాయి అంటున్నారు జనాలు . అంతలా అరవడానికి ఆ డైలాగ్ ఏంటి అనుకుంటున్నారా..? అక్కడ వచ్చింది ఎవరి పేరో కాదు పాన్ ఇండియా హీరో ప్రభాస్ పేరు. ఎస్ రావణాసుర సినిమా టీంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా జయరాం రెడ్డి ఓ రౌడి ఇంటికి వెళ్తాడు .

ఈ క్రమంలోనే అక్కడ లండన్ లో టూసైన్స్ విగ్రహం కట్టాలి మేడం అంటుంటే టూసైన్స్ విగ్రహం కట్టడానికి మీ అన్నయ్య ఏమన్నా ప్రభాసా..? విరాట్ కోహ్లీ నా..? అంటారు . ఈ క్రమంలోనే ఇద్దరు స్టార్ పేర్లు అక్కడ రావడంతో థియేటర్స్ లో జనాలు పూనకాళ్లు వచ్చినట్టు ఊగిపోతున్నారు . ఆ డైలాగ్ వినిపించిన ప్రతిసారి థియేటర్స్ దగ్గర వెళ్లి ప్రభాస్ అభిమానులు అరుస్తున్నారు. అంతకు డబల్ రేంజ్ లో విరాట్ కోహ్లీ అభిమానులు కూడా అరుస్తూ ఉండడం గమనార్హ. ఈ క్రమంలోనే రవితేజ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా కొత్త ఊపునిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news