Moviesనాగ‌చైత‌న్య - శోభిత ఎఫైర్ స‌మంత‌కు చెప్పిందెవ‌రు… ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డింది..!

నాగ‌చైత‌న్య – శోభిత ఎఫైర్ స‌మంత‌కు చెప్పిందెవ‌రు… ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డింది..!

తెలుగు సినీవినీలాకాశంలో ఒక్క‌సారిగా ఎగ‌సిప‌డిన అందాల బొమ్మ స‌మంత్ రూత్‌ప్ర‌భు. ఏడెనిమిదేళ్ల పాటు తెలుగు సినిమా రంగంతో పాటు సౌత్ సినిమా ఇండ‌స్ట్రీని ఏలేసిన స‌మంత‌కు యేడాది కాలంగా క‌ష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు అయితే అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చేసిందో అప్ప‌టి నుంచి స‌మంత కెరీర్‌లో అద్భుతాలు జ‌ర‌గ‌లేదు. పేరుకు హాలీవుడ్ ప్రాజెక్టులు అంటున్నా.. వాటి గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

య‌శోద బ్రేక్ ఈవెన్ అవ్వ‌డ‌మే క‌ష్ట‌మైంది. శాకుంత‌లం ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియ‌ట్లేదు. పైగా ఇది స‌మంత మార్కెట్‌తో పోలిస్తే ఓవ‌ర్ బ‌డ్జెట్ అంటున్నారు. ఇక చైతుతో విడాకులు అయ్యాక ఆరోగ్య ప‌రంగా స‌మంత ప‌డుతోన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సామ్ వ్య‌క్తిగ‌త జీవితం అంతా ఇప్పుడు క‌ల‌త‌లు, క‌ల్లోలాల్లో మునిగిపోయింది.

ఇదిలా ఉంటే ఆమె మయోసైటిస్ లాంటి అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతుండ‌డం ఆమె సినీ జ‌ర్నీకి పెద్ద అడ్డంకిగా మారింది. ఈ వ్యాధి వల్లే ఆమె విజయ్ దేవ‌ర‌కొండతో చేయాల్సిన ఖుషి ప్రాజెక్టుకు బ్రేక్ ప‌డింది. ఆమె బాలీవుడ్‌, హాలీవుడ్ ప్రాజెక్టులు ఎప్పుడు సెట్స్‌మీద‌కు వెళ‌తామో ? అందులో ఆమె ఎప్పుడు జాయిన్ అవుతుందో కూడా తెలియ‌ట్లేదు.

ఇదిలా ఉంటే సామ్‌, చైతు విడాకుల వెన‌క చాలా స్టోరీలే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ముఖ్యంగా ఆమె ఫ్యామిలీమేన్ వెబ్‌సీరిస్‌లో హ‌ద్దులు దాటి ప్రవ‌ర్తించ‌డం అక్కినేని ఫ్యామిలీకి న‌చ్చ‌క‌పోవ‌డం, దీనికి తోడు అమ‌ల సామ్‌పై క‌ఠిన ఆంక్ష‌లు పెట్టినందువ‌ల్లే ఆమె చైతుకు విడాకులు ఇచ్చేసింద‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే స‌మంత స్ప‌ర్థ‌ల త‌ర్వాత చైతుకు ఆరేడు నెల‌ల పాటు దూరంగా ఉంది.

ఆ టైంలోనే చైతు కూడా శోభిత ధూళిపాళ్ల‌తో వ్య‌వ‌హారం న‌డిపేశాడ‌ట‌. ఆమెతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతోన్న విష‌యం సామ్‌తో స‌న్నిహితంగా ఉండే కొంద‌రు ఆమె చెవిలో వేశార‌ట‌. అస‌లు సామ్ ఎక్కువుగా త‌న చుట్టుప‌క్క‌ల ఉంటూ త‌న‌తో స‌న్నిహితంగా ఉండే వారి మాట‌లే న‌మ్ముతుంద‌న్న టాక్ కూడా ఉంది. అస‌లు చైతు విష‌యంలో ఆమె బాగా ఇగో పెంచుకోవ‌డం వెన‌క కూడా వారే ఉన్నార‌న్న గుస‌గుస‌లు ఉన్నాయి.

శోభిత – చైతు క్లోజ్‌నెస్ విష‌యంలో వారు సామ్ మెద‌డులోకి ఎక్కించాల్సిందంతా ఎక్కించ‌డంతో ఆమె చైతుపై మ‌రింత కోపం పెంచేసుకుని వెంట‌నే విడాకులు ఇచ్చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. అస‌లు అంత‌కుముందు వ‌ర‌కు కూడా వాళ్లు ముర‌ళీమోహ‌న్ ఉంటోన్న పెంట్‌హౌస్ ప్లాట్‌లోనే చాలా క్లోజ్‌గా ఉండేవారు. అయితే ప‌క్క‌న ఉన్న వాళ్లు పుల్ల‌లు వేయ‌డం.. సామ్ వాటిని బాగా న‌మ్మేయ‌డంతో జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news