Moviesవార్నీ.. షూట్ ఆపేసి మరి ..త్రివిక్రమ్ క్రికేట్ ఆడింది అందుకా..?

వార్నీ.. షూట్ ఆపేసి మరి ..త్రివిక్రమ్ క్రికేట్ ఆడింది అందుకా..?

గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ పిక్ యమ వైరల్ గా మారింది . అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు .. క్రికెట్ ఆడుతూ ఉన్నటువంటి ఫోటో. అదేంటి మాటలు మాంత్రికుడు డైరెక్టర్ కదా ..క్రికెట్ ఎందుకు ఆడుతున్నాడు అనుకుంటున్నారా..? సినిమా ఇండస్ట్రీలో చాలామందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం ..సరదాగా అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు . అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు క్రికెట్ ఆడటం ఫస్ట్ టైం చూస్తున్నాం ..

ఎప్పుడు ఏదో పనిలో బిజీగా ఉంటూ ప్యాడ్ పెట్టుకొని రాసుకుంటూ కనిపించే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు రీసెంట్గా చేతిలో బ్యాట్ పెట్టుకొని ఫటా ఫటా సిక్స్ లు ఫోర్లు కొట్టేసారు . దానికి సంబంధించిన పిక్స్ , వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే చాలా లేట్ అయిన SSMB 28 సినిమా షూటింగ్ ఆపేసి మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎందుకు క్రికెట్ ఆడడా ..? అంటూ జనాల బుర్ర పీకుంటున్నారు.

అదేమి పెద్ద వరల్డ్ కప్ కాదు ..ఐపీఎల్ మ్యాచ్ అంతకన్నా కాదు ..మరి ఎందుకు అంత సీన్ చేశారు అంటూ సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటూ ఉండగా ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపడింది. మనకు తెలిసిందే ఏ సినిమాకైనా పబ్లిసిటీ ఇంపార్టెంట్. అది ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే . ఈ క్రమంలోని ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాకు కూసింత పాపులారిటీ తగ్గింది.

ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తన బుర్రకు పదును పెట్టాడు.. ఎంతసేపు మాటలతోనే కాదు చేతులతో పబ్లిసిటీ తెచ్చుకోవడానికి.. ప్యాడ్ పెన్ను పక్కనపెట్టి క్రికెట్ ఆడాడు . ఈ క్రమంలోని కోట్లు ఖర్చుపెట్టిన రాని పబ్లిసిటీ ఈ సినిమాకు వచ్చింది . ఇప్పుడు ఎక్కడ చూసినా సరే త్రివిక్రమ్ క్రికెట్ ఆడుతున్నటువంటి పిక్స్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. దీంతో సినిమాకి హ్యూజ్ పబ్లిసిటీ దక్కింది. దీనికోసమే త్రివిక్రమ్ పనులను పక్కన పెట్టుకొని మరి క్రికెట్ ఆడాడు అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news