Moviesమరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్.. షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన చిరంజీవి..ఏంది బాసూ...

మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్.. షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన చిరంజీవి..ఏంది బాసూ ఈ మాటలు..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హీరోగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య . సైలెంట్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య రిలీజ్ అవుతున్న థియేటర్స్ వద్ద హంగామా ఎక్కువగా నెలకొంది . భారీ భారీ ఫ్లెక్సీస్ తో మెగాస్టార్ చిరంజీవి కటౌట్లతో.. పాలాభిషేకాలు, పూలదండలు వేస్తూ మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి తన సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .

వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరంజీవి ..ఈ సినిమాలో బాస్ పార్టీ సాంగ్ సెట్ ను సరిగ్గా వినియోగించుకోలేదు అన్న కామెంట్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆయన మాటలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మనకు తెలిసిందే ఈ సినిమా నుంచి మొదటగా రిలీజ్ అయిన పాట బాస్ పార్టి. సినిమాలో ఈ పాట మరింత హైలెట్గా మారుతుందని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు .

అయితే ఈ సినిమాలో ఈ సెట్ కోసం మాత్రమే కోట్లు ఖర్చుపెట్టి సెట్ వేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టు చిరంజీవి కూడా ఈ సినిమాలో ఈ పాట కోసం చాలా కష్టపడ్డారని చాలా రోజులు వర్క్ చేశారని .. ఈ పాటలో సెట్ ని ఇంకొంచెం వైడ్ గా.. లాంగ్ షాట్ లో చూయించుంటే ఇంకా బాగుండేది అన్న కామెంట్స్ చేశాడు . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో బాస్ పార్టీ సాంగ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రిలీజ్ కి కొన్ని గంటల ముందు చిరు ఇలా మాట్లాడటం సంచలనంగా మారింది. చూడాలి మరి వీర సింహారెడ్డి సినిమా స్థాయికి వాల్తేరు వీరయ్య ఉంటుందో లేదో..? మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news