Moviesతెలిసి తెలిసి..ఒక్కే తప్పు చేస్తున్న ఈ ముగ్గురు హీరోలు.. మీకు...

తెలిసి తెలిసి..ఒక్కే తప్పు చేస్తున్న ఈ ముగ్గురు హీరోలు.. మీకు ఇదేం కర్మ రా బాబు ..!!

ఎస్ ప్రజెంట్ ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ ప్రధానంగా నలుగురు పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వాళ్లే తారక్ -చరణ్ -ప్రభాస్ -బన్నీ. ఈ నలుగురు హీరోల పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి .దానికి మెయిన్ రీజన్ పాన్ ఇండియా లెవెల్లో స్టేటస్ సంపాదించుకోవడమే .

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా హీరోలు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్ . అలాంటి ఒక్క స్థానాన్ని సంపాదించుకున్న ప్రభాస్ ..ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. కాగా రీసెంట్ గానే పాన్ ఇండియా స్టేటస్ అందుకున్న బన్నీ.. ముగ్గురు ఒకే తప్పు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . బన్నీ అప్పుడెప్పుడో పుష్ప సినిమాతో అభిమానులను థియేటర్స్ లో పలకరించారు. ఇక తర్వాత తన సినిమాకి సంబంధించిన అప్డేట్ ని రివిల్ చేయలేదు.

ఇదిగో అప్డేట్ అదిగో అప్డేట్ అంటున్నారే ..కానీ ఇప్పటివరకు పుష్ప2కు సంబంధించిన ఒక్క విషయం కూడా బయటకు లీక్ చేయలేదు . అదే విధంగా తారక్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా రివిల్ చేయలేదు . దీంతో నందమూరి ఫ్యాన్స్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఇక రాంచరణ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎండ్ కార్డు పెట్టేసిన చరణ్ అప్పుడెప్పుడో ఆర్ సి 15 అనే సినిమాను ప్రకటించాడు. ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ టైటిల్ ఫస్ట్ లుక్ ఏది రిలీజ్ చేయలేదు . ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టేటస్ వచ్చాక ఈ ముగ్గురు హీరోలు ఒకే తప్పు చేస్తున్నారని ..తమ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేయకుండా అభిమానులను ఊరిస్తున్నారని ..అదే వెయిటింగ్ ఎక్కువైతే అభిమానులు తిరగబడే ఛాన్స్ కూడా ఉందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news